ద‌ర్శ‌కేంద్రుడి ఓల్డ్ స్కూల్ స్టైల్‌లో `ఓ బాబూ..`

రాఘ‌వేంద్ర‌రావు… న‌టుడిగా మేక‌ప్ వేసుకుని తొలిసారి కెమెరా ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ఓ.. బాబూ` అనే పేరు ప‌రిశీల‌న‌లో వుంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు భ‌ర‌ణినే అయినా, ద‌ర్శ‌కేంద్రుడి ఓల్డ్ స్కూల్ స్టైల్‌లోనే.. మేకింగ్ సాగ‌బోతోంద‌ట‌.

ఇది వ‌ర‌కు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే.. ఓ రేంజ్ లో ఉండేవి. ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, డాన్స్ మాస్ట‌ర్‌.. ఇలా వీళ్లంతా ఓ చోట కూర్చుని.. పాట‌ల‌పై క‌స‌ర‌త్తు చేసేవారు. ఇప్పుడు అలా లేదు. ద‌ర్శ‌కుడు ఓ చోట‌.. సంగీత ద‌ర్శ‌కుడు మ‌రో చోట‌. గీత ర‌చ‌యిత ఇంకో చోట‌. వాళ్లంతా ఆన్ లైన్లో ముచ్చ‌టించుకుని పాట పుట్టించేస్తున్నారు. కానీ.. `ఓ బాబూ` కోసం మాత్రం పాత రోజుల్లోకి వెళ్లిపోయింది చిత్ర‌బృందం.

హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ రిసార్ట్ లో మూడు రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వ‌హించార్ట‌. ఆ సిట్టింగ్స్‌లో సినిమాకి సంబంధించిన ప్ర‌ధాన సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు అంతా క‌లిసి పాల్టొన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూడురోజుల్లోనే ట్యూన్ల‌న్నీ రెడీ చేసేశార‌ని, అక్క‌డే… చంద్ర‌బోస్ తో పాటలూ రాయించేశార‌ని టాక్‌. రాఘవేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో `పెళ్లి సంద‌డి` మొద‌లు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. `పెళ్లి సంద‌డి` అయ్యాకే.. `ఓ బాబూ` సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే ఈలోగా.. పాట‌ల ప‌ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. రాఘ‌వేంద్ర‌రావు భార్య‌గా ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉంటార్ట‌. ఆ వివ‌రాల‌న్నీ త్వ‌ర‌లోనే తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close