పోయిన చోటే వెదుక్కోమని రఘువీరాకి రాహుల్ చెప్పారట..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో.. ఆ పార్టీలో మిగిలి ఉన్న నేతలకే అర్థం కావడం లేదు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీలో చేరడాన్ని సంక్రాంతి పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు కానీ.. ఆయన వల్ల వచ్చే లాభమేమిటన్నదాన్ని విశ్లేషణ చేసుకుంటే.. నీరసం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు వచ్చి చేరినా.. వారి అండతో రాహుల్ గాంధీ పర్యటనను ఓ సారి పర్వాలేదనిపించుకునేలా జరిపినా… కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్ ఉందని.. చోటామోటా నేతలు కూడా నమ్మలేకపోతున్నారు. ఆ పార్టీలో మిగిలిన ఉన్న ఒకరు, ఇద్దరు నేతలు కూడా.. వేరే దారి చూసుకుంటున్నారు. చివరికి నాదెండ్ల మనోహర్ .. కాంగ్రెస్ తప్ప.. ఏ పార్టీ అయినా పర్వాలేదన్నట్లు.. వెళ్లి పవన్ కల్యాణ్‌ జనసేనలో చేరిపోయారు.

నాదెండ్ల భాస్కరరావు… కాంగ్రెస్ పెంచిన వ్యక్తి. ఇందిగాంధీని వ్యతిరేకించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ను… గద్దె దింపడానికి.. ఇందిరా గాంధీ నమ్మిన వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు.. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఓ సారి స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి బద్దుడిగా ఉంటారని అందరూ అనుకున్నారు కానీ.. అనూహ్యంగా జనసేనలో చేరిపోయారు. వైసీపీ, టీడీపీ నుంచి ఆహ్వానం లేకపోవడం.. చేరుతానని చెప్పినా… స్పందించకకపోవడంతో… ఆయన జనసేనలో చేరిపోయారని చెబుతున్నారు. ఓ వైపు.. రాహుల్‌ను కలిసేందుకు రఘువీరా ఢిల్లీలో ఉన్న సమయంలోనే… ఈ జంపింగ్ చోటు చేసుకోవడంతో.. ఆయన నిరాశకు గురయ్యారు.

ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెతుక్కోవాలని రాహుల్‌చెప్పారని రఘువీరా.. చెప్పుకొచ్చారు. ఏపీలో పొత్తులపై రాహుల్‌దిశానిర్దేశం చేశారన్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు మంచి స్పందన ఉందిని.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధం కావాలని సూచించారని చెప్పుకొచ్చారు. నాదెండ్ల నాదెండ్ల మనోహర్‌కాంగ్రెస్‌ను వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.ఇతర పార్టీ నేతలను దరిచేరనీయమని పవన్‌చెప్పారు టీడీపీ, బీజేపీ, వైసీపీ చేసిందే పవన్‌చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రఘువీరా కొద్ది రోజుల క్రితం ఇంటింటి కాంగ్రెస్ పేరుతో హడావుడి చేశారు. మళ్లీ సైలెంటయ్యారు. మిగిలన నేతలు కూడా… తలోదారి చూసుకూంటే.. ఇక కాంగ్రెస్‌కు ఏపీలో అవసలు పోటీ విషయం కూడా ఆలోచిస్తుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close