పేదలకు నగదు బదిలీ చేయాల్సిందేనంటున్న రాహుల్ గాంధీ..!

పేద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి వరుసగా విడుదల చేస్తున్న ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా లేవన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. మూడో ప్యాకేజీ ప్రకటించిన తరవాత కేంద్రం నేరుగా ఎవరికీ…నగదు సాయం చేయడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన రాహుల్…కేంద్ర ప్రభుత్వం విపక్షాల సలహాలను కూడా తీసుకోవాలని సూచించారు. పేద ప్రజల జేబుల్లోకి డబ్బులు నేరుగా చేరేలా చూడాలని రాహుల్‌ గాంధీ ప్రధానికి సూచించారు. ఆర్థిక ప్యాకేజి విషయంలో ప్రధాని పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని … వలస కూలీలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించుకోవాలని .. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భారత్‌ నిర్మాణంలో వలస కార్మికులు కీలక భాగస్వాములని గుర్తు చేశారు. పేదలకు ప్రత్యక్షంగా నగదు సాయం చేసి.. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజిని నిజాయితీగా అమలు చేస్తేనే ప్రయోజనాలు ఉంటాయన్నారు.

రాహుల్ గాంధీ లాక్ డౌన్ పరిణామాలు.. ఆర్థిక వ్యవస్థకు వచ్చే సవాళ్లు.. తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రఖ్యాత ఆర్థికవేత్తలతో కొన్నాళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు తీసుకుంటున్నారు. వాటిని మీడియా ముఖంగా చెబుతూ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. పేదలకు నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో కదలిక వస్తుందని.. రాహుల్ గాంధీ అభిప్రాయం. అయితే కేంద్రం మాత్రం కొత్తగా ప్రకటిస్తున్న ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో.. ఎవరికీ నగదు బదిలీ పథకం ప్రకటించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close