“కిరీటం” లేకపోతేనేమి.. కాంగ్రెస్‌ను నడుపుతోంది రాహులేగా !?

రాహుల్ గాంధీ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు సిద్దంగా లేరు. పార్టీలో సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తితో గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎవరు.. ఎన్ని సార్లు చెప్పినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. చివరికి సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి బండి నడిపిస్తున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కూడా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ప్రకటించే నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు.

దీంతో సోనియా గాంధీనే తాను తాత్కాలికం కాదని.. స్పష్టం చేసి.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో ఎవరూ మాట్లాడవద్దన్నారు. జీ -23 పేరుతో ప్రత్యక్ష ఎన్నికల్లో పెద్దగా పాల్గొనకుండా పార్టీలో పలుకుబడి సాధించిన నేతలు… కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై రచ్చ చేస్తున్నారు. వీరిని ఉద్దేశించే సోనియా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాహుల్ గాంధీ అసంతృప్తి కూడా వారిపైనే. వారు మారడంలేదు.. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా లేరు. అయితే.. 90శాతం మంతి కాంగ్రెస్ క్యాడర్‌తో పాటు అన్ని స్థాయిల నేతల్లోనూ రాహుల్‌కు సానుకూలత ఉంది.

ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించాలనే డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. నిజానికి అనారోగ్యం వల్ల సోనియా పార్టీ కి అధ్యక్షురాలిగా ఉన్నా.. అత్యంత క్లిష్టమైన విషయాల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిగతా అన్నీ రాహులే చూసుకుంటున్నారు. ఓ రకంగా వర్కింగ్ ప్రెసిడెండ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించడానికి ఆయనకూడా సిద్ధంగా లేరు. అందుకే ఆలస్యం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close