మోడీ గుట్టు రట్టు చేస్తారట; నిజమేనా, కామెడీనా?

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుట్టు రట్టు చేసే పేలుడు పదార్థం లాంటి సమాచారం నా దగ్గరుంది. దాన్ని బయటపెడితే మోడీ బండారం బయట పడుతుంది. అందుకే ఆయన భయపడుతున్నారు. నన్ను లోక్ సభలో మాట్లాడనివ్వడం లేదు”.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణ ఇది. మోడీపైనే పరోక్షంగా చేసిన అవినీతి ఆరోపణ ఇది. ఆ ఆధారాలు ఏమిటో రాహుల్ చెప్పలేదు.

రాహుల్ గాంధీ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆయన వ్యవహార శైలిని గమనించే చాలా మంది రాహుల్ చెప్పే విషయాలను సీరియస్ గా తీసుకోరు. కొందరైతే జోకర్ అని విమర్శిస్తారు. మరికొందరు మాట నిలకడలేని మనిషంటారు. కొందరు మాత్రం ఆయన మంచి నాయకుడని నమ్ముతారు.

బీజేపీ నాయకులు మాత్రం రాహుల్ ను ఓ జోకర్ గానే చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. మోడీపై ఆధారాలున్నాయన్న రాహుల్ మాట ఈ ఏడాది అతిపెద్ద జోక్ అంటూ కమలనాథులు కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కూడా రాహుల్ అన్నారు. భూకంపం రావడం కాదు, ఆయన కాళ్ల కిందే నేల కదిలిపోతుందని బీజేపీ ఎదురు దాడి చేసింది.

మోడీ అనే రెండక్షరాలు వినగానే విరుచుకు పడే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు విచిత్రంగా రాహుల్ మాటను ఓ జోక్ తరహాలో తీసుకోవడం ఆశ్చర్యకరం. నిజంగానే ఆధారాలుంటే బయటపెట్టాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంటులో మాట్లాడనివ్వకపోతే ఆ ఆధారాలను మీడియా సాక్షిగా బయట పెట్టవచ్చు కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంగా రాజకీయ ఎత్తుగడ కావచచని కొందరు పరిశీలకులు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. అదే నిజమైతే రాహుల్ గాంధీ విశ్వసనీయ మరింత తగ్గుతుందేమో !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close