రాజ్‌ త‌రుణ్ త్యాగానికి ద‌క్క‌ని ప్ర‌తిఫ‌లం

ఫ్లాపుల్లో ఉన్న హీరోకి దిల్‌రాజు సంస్థ‌లో సినిమా చేసే ఛాన్సొస్తే.. అంత‌కంటే ఆనందం ఏముంది? ఈసారి ఎలాగైనా హిట్టొచ్చిన తీరుతుంద‌న్న గ్యారెంటీ ఉంటుంది. ఆ న‌మ్మ‌కంతోనే రాజ్ త‌రుణ్ ఉండేవాడు. దిల్‌రాజు సంస్థ‌లో రాజ్ త‌రుణ్ చేసిన రెండో సినిమా.. ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’. ఈ సినిమా గురించి త‌రుణ్ ఎప్పుడూ కాన్ఫిడెన్స్‌తోనే మాట్లాడేవాడు. దిల్ రాజు క‌థ‌ల ఎంపిక‌పై న‌మ్మ‌కం ఉన్న‌వాళ్లంద‌రికీ… రాజ్ త‌రుణ్ మాట‌లు పెద్ద వింత‌గానూ, విశేషంగానూ అనిపించేవి కావు. ఈసారి రాజ్ త‌రుణ్ క‌ల నెర‌వేరుతుంద‌నిపించింది.

దానికి త‌గ్గ‌ట్టుగానే రాజ్ త‌రుణ్ కూడా త‌న‌వంతు త్యాగాలు చేశాడు. ఈ సినిమా కోసం త‌నేం పారితోషికం తీసుకోలేదు. సినిమా బాగా ఆడితే – అప్పుడు చూద్దాం అని డిసైడ్ అయ్యాడు. నిర్మాత‌కు అది క‌లిసొచ్చే వ్య‌వ‌హార‌మే. కేవ‌లం నెలకు ఇంత అంటూ ఖ‌ర్చుల కోసం కొంత మొత్తం తీసుకునేవాడంతే. త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికి జీతాలు కూడా త‌నే ఇచ్చుకున్నాడు. ఎన్ని కాల్షీట్లు కావాలంటే అన్నీ ఇచ్చాడు. కానీ… ఫ‌లితం ఏమైంది? ఈ సినిమాకి కూడా తొలి ఆట పూర్త‌వ్వ‌గానే డిజాస్ట‌ర్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. తొలి రోజు థియేట‌ర్ల‌లో జ‌న‌మే క‌నిపించ‌లేదు. దిల్‌రాజు సంస్థ‌లో ఇంత నీర‌స‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమా వ‌స్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. ఈ సినిమాతో రాజ్ త‌రుణ్‌కి కొత్త‌గా పోయేదేం లేదు. కాక‌పోతే… న‌మ్ముకున్న సినిమా, పారితోషికం కూడా కాద‌నుకుని చేసిన సినిమా.. ప‌ల్టీకొట్టేసింది. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ ‘ఒరేయ్ బుజ్జి’పైనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close