రాజయ్య కొడుకు సనని కూడా మోసం చేసాడు

మాజీ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కొడుకు అనిల్ తన భార్య సారికను తెలియకుండా హైదరాబాద్ లో సన అనే మహిళను వివాహం చేసుకొన్నట్లు వార్తలు వచ్చేయి. కానీ పోలీసులు శుక్రవారం ఖమ్మం జిల్లాలో సనను అదుపులో తీసుకొన్న తరువాత ప్రశ్నించినపుడు అనిల్ ఆమెను కూడా మోసం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ లో చిన్న గాజుల దుఖానం నడిపించుకొంటూ జీవనం సాగిస్తున్న సనతో ఒక మిస్డ్ కాల్ ద్వారా అనిల్ పరిచయం అయ్యాడు. తన గురించి వివరాలు ఆమెకి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఆమెను వివాహం చేసుకొని హైదరాబాద్ లో ఆమెతో కాపురం చేస్తున్నాడు. వారికి ఒక పిల్లాడు పుట్టిన తరువాత కానీ అతను మాజీ ఎంపీ రాజయ్య కొడుకు అని అతనికి ఇదివరకే వివాహం జరిగిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనే సంగతి సనకు తెలియలేదు. ఆ సంగతి తెలిసినప్పటి నుండి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.

సరిగ్గా అదే కారణంతో అనిల్-సారికల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఒక ప్రజా ప్రతినిధి కొడుకు అయ్యుండి కూడా అతను ఇద్దరు మహిళలను మోసం చేసాడు. చివరికి సనకి రూ.10లక్షలు చెల్లించి వదిలించుకొనేందుకు రాజయ్య అంగీకరించాడు. కానీ ఇంతలోనే ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొంది. అందులో తన పేరును కూడా నాల్గవ ముద్దాయిగా చేర్చినట్లు తెలుసుకోగానే భయపడిన సన తన చంటి పిల్లాడిని తీసుకొని హైదరాబాద్ నుండి పారిపోయింది. కానీ ఖమ్మం జిల్లాలో ఆమె పోలీసులకి దొరికిపోయింది. పోలీసులు ఆమెను వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజి స్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది.

రాజయ్య, అతని భార్య మాధవిలత వారి కొడుకు అనిల్ కలిసి చేసిన ఈ పనికి ఇద్దరు మహిళల నిండు జీవితాలు బలయిపోయాయి. సారిక, ఆమె ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి అయిపోయారు. సన భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.అభం శుభం తెలియని సన కుమారుడి జీవితం ప్రశ్నార్ధకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close