చంద్రబాబు బీసీలను ఉసిగొల్పుతున్నారన్న కాంగ్రెస్, వైసీపీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను కాపులపై ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఇవాళ హైదరాబాద్‌లో మాట్లాడుతూ, కాపులకు, బీసీలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. గతంలో మాల, మాదిగల మధ్య ఇలాగే చిచ్చు పెట్టారని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదని హెచ్చరించారు. ఇవాళ జరుగుతున్న బీసీల కలెక్టరేట్ ముట్టడి వెనక ఉన్నది చంద్రబాబేనని ఆరోపించారు. కాపుగర్జనకు హాజరైతేనే కేసులుపెడితారా అని ప్రశ్నించారు. ఆ సభలో ముద్రగడ ఒక్కరే మాట్లాడారని చెప్పారు.

మరోవైపు బొత్స సత్యనారాయణ తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. తుని సభకు అనుమతి ఇచ్చామని సీఎమ్, ఇవ్వలేదని పోలీసులు అంటున్నారని, ఎవరి మాటలు నమ్మాలని అడిగారు. తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించటాన్ని తప్పుబట్టారు. బయటివ్యక్తులు ఎవరూ రావద్దని ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు. బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యనుద్దేశిస్తూ, తెలంగాణలో 23 కులాలను బీసీ జాబితాలోనుంచి తొలగిస్తే ఎందుకు మాట్లాడలేదని అడిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close