రూ.500 కోట్ల‌తో రామాయణం : అల్లు అర‌వింద్ ఏమంటున్నాడు?

టాలీవుడ్‌లో మ‌రో భారీ ప్రాజెక్టుకు అతి త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ చిత్రానికీ పెట్ట‌నంత పెట్టుబ‌డితో ఏకంగా రూ.500 కోట్ల‌తో ఓ చిత్రం రూపొంద‌నుంది. అదీ మ‌న తెలుగులో. రామాయ‌ణ గాథ‌ని వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి ఓ భారీ క‌స‌ర‌త్తు మొద‌లైంది. ఈ ప్రాజెక్టులో అల్లు అర‌వింద్, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా భాగ‌స్వాములు కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. అయితే న‌టీన‌టులు ఎవ‌రు? సాంకేతిక నిపుణులెవ‌రు? అనే విష‌యాల‌పై క్లారిటీ రావాల్సివుంది. “ఈ ప్రాజెక్టు ఓ గురు త‌ర బాధ్య‌త‌. అనిత‌ర సాధ్య‌మైన ఓ చిత్రాన్ని భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌కు అందివ్వ‌బోతున్నాం. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాలు చెబుతాం“ అని ప్ర‌క‌టించారు అల్లు అర‌వింద్‌. మెగా ఫ్యామిలీలో బోల్డంత మంది హీరోలున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌లు స్టార్ డ‌మ్ సంపాదించుకొన్నారు. పైగా క‌త్తి యుద్దాల్లో ప్రావీణ్యం ద‌క్కించుకొన్న‌వాళ్లే. మ‌రి వీళ్ల‌లో ఎవ‌రికి ఈ రామాయ‌ణంలో ఛాన్స్ వ‌స్తుందో చూడాలి. అంత‌ర్జాతీయ ప్రాజెక్టు కాబట్టి మిగిలిన అన్ని భార‌తీయ భాష‌ల్లోకీ ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ చిత్ర సీమ‌ల‌నుంచి కూడా న‌టీన‌టుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ఎంపిక చేసుకోవ‌డం త‌థ్యం. మ‌రి.. ఆ జాబితాలో ఎవ‌రెవ‌రు ఉంటారో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close