హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు తీసుకుంటున్నా : రమేష్‌కుమార్

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా తనను తొలగిస్తూ… తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. కాసేపటికే… నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పు మేరకు తాను.. ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నానని ప్రకటించారు. వ్యక్తులు కాదని.. రాజ్యాంగ వ్యవస్థలు.. విలువలు ముఖ్యమని ప్రకటించారు. ఇంతకు ముందు లానే తాను నిష్ఫక్షిపాతంగా పని చేస్తానని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుని.. స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్తానని ప్రకటించారు.

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నాలుగేళ్ల కిందట నియమితులయ్యారు. చట్టం ప్రకారం.. ఆయనకు అరవై ఐదేళ్లు లేదా.. పదవీ కాలం ఐదేళ్లు పూర్తయ్యే వరకూ పదవిలో ఉండాలి. ఈ రెండూ పూర్తి కాలేదు. అయితే.. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చని ప్రభుత్వం సంస్కరణల పేరుతో ఆర్డినెన్స్ తీసుకు వచ్చి.. తొలగించింది. దాన్ని కోర్టులో సవాల్ చేసినరమేష్ కుమార్ తన పదవిని మళ్లీ పొందారు. రమేష్ కుమార్ మళ్లీ ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకోవడంతో… స్థానిక ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాజకీయ పార్టీల్లో ప్రారంభమయింది.

రమేష్‌కుమార్‌ను తొలగించడానికి ముందు ఆయన.. కొంత మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఉన్నారు. ప్రభుత్వం వాటిని తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాలన్నీ అమల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్ఈసీ కనగరాజ్ వచ్చిన తరవాత కొన్ని ఆదేశాలిచ్చారు. ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పినందున.. అవి కూడా చెల్లుబాటయ్యే అవకాశాలు లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close