తెలుగులో దూసుకుపోతున్న రాశీఖన్నా… ఇప్పుడు తమిళంపై దృష్టి పెట్టింది. మంచి అవకాశం వస్తే తమిళంలో నటిస్తా… అని చెప్పుకొంటూ వచ్చిన రాశీకి ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. సిద్దార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం సైతాన్కీ బచ్చా. హారర్, కామెడీ, రొమాంటిక్ జోనర్లో సాగే ఈ చిత్రంలో కథానాయికగా రాశీఖన్నాని ఎంచుకొన్నారు. తెలుగులోనూ ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలున్నాయి. తమిళ సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. నేను చేస్తున్న తొలి హారర్ సినిమా ఇదే. సిద్దార్థ్తో నటించడం హ్యాపీగా ఉంది అంటోంది రాశీఖన్నా. ప్రస్తుతం రామ్ హైపర్, గోపీచంద్ ఆక్సిజన్లో కథానాయికగా నటిస్తోంది రాశీఖన్నా.
సిద్దార్థ్ హిట్టు చూసి చాలా కాలమైంది. ప్రేమకథలు విడచి యాక్షన్ బాట పట్టినా, యాక్షన్సినిమాలు మానేసి హారర్ సినిమాలవైపు కొచ్చినా సిద్దూని పట్టించుకోలేదెవ్వరూ. సైతాన్కీ బచ్చాతో సిద్దూ ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే హారర్ థ్రిల్లర్ సినిమాల క్రేజ్ చివరి దశలకు వచ్చేసింది. మహా ఎక్స్ట్రార్డనరీగా ఉంటే తప్ప.. జనాలు చూడడం లేదు. ఈదశలో సిద్దూ అరిగిపోయిన క్యాసెట్టే వేయడం విచిత్రమే. మధ్యలో తమిళం నుంచి ఎన్ని అవకాశాలొచ్చినా అవన్నీ వద్దనుకొని రాశీఖన్నా ఈ సినిమా ఎందుకు ఒప్పుకొందో?