రాశీ ఇంకా త‌గ్గిస్తానంటోంది

తొలి సినిమా.. ఊహ‌లు గుస‌గుస‌లాడేతోనే ఆక‌ట్టుకొంది రాశీఖ‌న్నా! ఉత్త‌రాది భామే అయినా… ద‌క్షిణాది ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌డంతో ఆమెకు మంచి మార్కులు ప‌డ్డాయి. అందం, అభిన‌యం మేళ‌వించిన చాతుర్యం కూడా ఆక‌ట్టుకొంది. ఎక్స్‌పోజింగ్ చేయమంటే వై అని క్వ‌శ్చ‌న్ చేయ‌కుండా వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ వినియోగించుకొంది రాశీ. బెంగాల్ టైగ‌ర్‌లో త‌మ‌న్నా అందాల‌కే గ‌ట్టి పోటీ ఇచ్చి అంద‌రినీ విస్మ‌య‌ప‌రిచింది. ఇది వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన రాశీ తర్వాత‌ర్వాత‌.. స‌న్న‌బ‌డింది. దానికీ ఓ కార‌ణం ఉందంటోంది రాశీ.

”తెలుగువారికి బొద్దుగా ఉంటేనే న‌చ్చుతుంద‌ని అనుకొన్నా. అందుకే నా తొలి సినిమాలో లావుగా క‌నిపించా. కానీ నా అభిప్రాయం త‌ప్ప‌ని త‌ర‌వాత తెలిసింది. లావు, సన్నం అన్న‌ది ఇక్క‌డ స‌మ‌స్య కాదు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలంతే. ఆ విష‌యం తెలుసుకొని స్లిమ్ అవ్వ‌డం మొద‌లెట్టా…” అంటోంది రాశీ. జిల్ సినిమా త‌ర‌వాత 5 కేజీలు త‌గ్గింద‌ట‌. మున్ముందు ఇంకా బ‌రువు త‌గ్గిస్తానంటోంది. ”లావుగా ఉన్న‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నా. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. అలాగ‌ని ఆహార అల‌వాట్ల‌ని వ‌దులుకోలేదు. అన్నీ తింటున్నా. కానీ బ‌రువు అదుపులో ఉంచుతున్నా. రేప్పొద్దుట నా పాత్ర కోసం మళ్లీ లావుగా మారాలన్నా నేను రెడీనే” అని చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close