బాల‌య్య కోసం క్యూలో మ‌రో ద‌ర్శ‌కుడు

వందో సినిమాతో సంచ‌ల‌నం సృష్టించాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. త‌న 99 సినిమాల రికార్డుల్ని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బద్ద‌లు కొట్టేసింది. ఇప్పుడు అభిమానుల దృష్టి బాల‌య్య 101వ సినిమాపై కేంద్రీకృత‌మైంది. బాల‌య్య కోసం చాలామంది ద‌ర్శ‌కులు ఇప్ప‌టికే క‌థ‌లు రెడీ చేసేసుకొన్నారు. అయితే బాల‌య్య మాత్రం కాస్త కూడా తొంద‌ర ప‌డ‌డం లేదు. వందో సినిమా కోసం ఎంత వేచి చూశాడో.. 101వ సినిమాకోసం కూడా అంతే ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. ఈలోగా బాల‌య్య‌కు క‌థ వినిపించాల‌న్న ద‌ర్శకుల క్యూ పెరుగుతూనే ఉంది. ఆ జాబితాలో ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు కూడా చేరిపోయిన‌ట్టు స‌మాచారం. త‌నే కె,ఎస్‌.ర‌వికుమార్‌.

త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల‌హాస‌న్‌, సూర్య‌, విజ‌య్‌లాంటి స్టార్ల‌తో సినిమాలు చేశాడు ర‌వికుమార్‌. తెలుగులో చిరంజీవి, నాగార్జుల‌తో ప‌నిచేశాడు. క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా, త‌క్కువ టైమ్‌లో సినిమాలు తీసిపెట్టే ప్ర‌తిభావంతుడిగా ర‌వికుమార్‌కి మంచి పేరే ఉంది. తెలుగులో ఓ సినిమా చేయాల‌ని గ‌త కొంత‌కాలం నుంచీ ర‌వికుమార్ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. తాజాగా బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేసిన‌ట్టు, బాల‌య్య అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌మిళ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి మిగిలిన హీరోలంతా రెడీగా ఉన్నా… బాల‌య్య ఎందుక‌నో స‌ముఖత చూపించ‌డం లేదు. ఇటీవ‌ల కె.వాసు ఓ క‌థ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తే బాల‌య్య క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ట‌. మ‌రి ర‌వికుమార్ కి ఎలాంటి అనుభ‌వం ఎదుర‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close