తమిళ ‘తెరి’ కథను పక్కన పెట్టేసి కొత్త కథతో సినిమా చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ కల్యాణ్ కోసం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేత ‘తెరి’ కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయించింది. కథ సిద్ధమైన సమయానికి పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన అనుమతి తీసుకుని రవితేజ హీరోగా అదే కథతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టారు. ‘నెల టికెట్’ విడుదలకు ముందు ఒక ఫైట్ కూడా తీశారు. ఏమైందో ఏమో… ప్రస్తుతం సినిమా కథ మారింది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ విడుదల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ ఈ విషయాన్ని చెప్పారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయేది రీమేక్ కాదని, కొత్త కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని అయన తెలిపాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ సినిమాల ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేబోయే సినిమా గురించి రవితేజ మాట్లాడడానికి రవితేజ ఇష్టపడలేదు. దాని గురించి తరవాత మాట్లాడతానని అన్నారు.