చంద్రబాబుని హెచ్చరించిన టీడీపీ ఎంపీ..!

✍ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారా? పార్టీ కోసం పని చేసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందా? తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి.

👉 గుంటూరు కమ్మజనసేవా సమితిలో జరిగిన కుల సమావేశానికి హాజరైన ఎంపీ రాయపాటి. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కమ్మకులాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పార్టీని నిలబెట్టే వారిని, పార్టీ కోసం పనిచేసే వారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని రాయపాటి విమర్శించారు. ఓట్లు, పదవి కోసం బాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నారని రాయపాటి పేర్కొన్నారు. టీడీపీలో స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఉండదన్న రాయపాటి.. టీడీపీలో తాను జూనియర్ నేతనని, అందువల్ల తాను పెద్దగా ప్రశ్నించలేకపోతున్నానని వివరించారు. పార్టీలోని సీనియర్‌ కమ్మ నేతలు సైతం చంద్రబాబును ప్రశ్నించే అవకాశం లేకపోవడం దురదృష్టకరమన్నారాయన.
గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మ సామాజికవర్గం అంతా కలిసి పని చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా రాయపాటి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కమ్మ వారిని ముఖ్యమంత్రి చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు. ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం కలగడం మంచిది కాదని, చంద్రబాబు ప్రస్తుత వైఖరే కొనసాగిస్తే పార్టీ ఉనికికి ప్రమాదం వస్తుందని రాయపాటి హెచ్చరించారు. గ్రామస్థాయి కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్న రాయపాటి.. ఇది పార్టీకి మనుగడకు మంచిది కాదని చెప్పారు. ఇక రిటైర్డ్ ఐఎఎస్ లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది కూడా మంచిది కాదని రాయపాటి అభిప్రాయపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని రాయపాటి స్పష్టం చేశారు.

👉 అయితే రాయపాటి వ్యాఖ్యల్లో నిజం లేదని కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకులు అంటున్నారు. కేబినెట్‌ తో పాటు యంత్రాంగంలో కీలక పదవులను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆ విషయం మరిచిపోయి చంద్రబాబును ఇలా విమర్శించడం సరికాదని రాయపాటిపై కొందరు కమ్మ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా రాయపాటి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో హాట్ టాపిక్ గా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close