ఎన్టీఆర్‌గా న‌టించ‌మంటే… ఎన్టీఆర్ ఏమ‌న్నాడో తెలుసా??

సావిత్రి జీవిత క‌థ‌ని `మ‌హాన‌టి` పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొన్నారు. చిన్న సినిమాగా అనుకొన్నా.. రాను రాను ఓ భారీ సినిమాగా రూపాంతరం చెందుతూ వ‌స్తోంది మ‌హాన‌టి. సావిత్రి జీవిత క‌థ అంటే ఆ త‌రం అగ్ర న‌టీన‌టుల్ని చూపించాల్సిందే. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్ పాత్ర‌లు త‌ప్ప‌ని స‌రి. ఈ పాత్ర‌ల్లోఎవ‌రు క‌నిపిస్తార‌న్న ప్ర‌శ్న‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తోంది. ఎన్టీఆర్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే… ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని చిత్ర‌బృందం కొట్టి ప‌రేసింది.

నిజానికి ఎన్టీఆర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ని సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మే అని తెలిసింది. ఎన్టీఆర్‌కి క‌థ‌, త‌న పాత్ర గురించి మొత్తం చెప్పార్ట‌. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ”తాత‌య్య‌గా క‌నిపించే స్థాయి నాకు లేదు.. ఆ పాత్ర‌ని క్యారీ చేసేంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు” అన్నాడ‌ట‌. ఎన్టీఆర్‌ని ఎన్నివిధాలుగా ఒప్పించ‌డానికి ప్ర‌య‌త్నించినా, ఎన్టీఆర్ నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌ని తెలుస్తోంది. జూనియ‌ర్‌కీ అశ్వ‌నీద‌త్‌కీ మ‌ధ్య మంచి అనుబంధ‌మే ఉంది. ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన శ‌క్తి అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సానుభూతితో అయినా.. ఎన్టీఆర్ ఈ సినిమాకి ఓకే చెబుతాడనుకొన్నారంతా. అయితే.. ఎన్టీఆర్ మాత్రం.. ‘నో’ అంటున్నాడు. అయితే చివ‌రి వ‌ర‌కూ ఎన్టీఆర్ డేట్ల కోసం ఎదురుచూద్దామ‌ని, కాని ప‌క్షంలో ప్ర‌త్యామ్నాయం ఆలోచించాల‌ని అశ్వ‌నీద‌త్ భావిస్తున్నార్ట‌. మ‌రి ద‌త్తు ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close