టీవీ 9లో జనసేన కవాతులు ఎందుకు కనిపించడం లేదు..? ఆరెస్సెస్ ఏం చేసింది..?

జనసేన కార్యక్రమాలు .. ప్రముఖ టీవీ చానల్ టీవీ 9లో ప్రసారం కావడం లేదు. రోజువారీ ప్రజాపోరాటయాత్రల విషయంలోనే.. సోమవారం నిర్వహించిన మెగా కవాతు విషయంలోనూ… టీవీ 9 పూర్తిగా.. జనసేనకు దూరం పాటించింది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే.. గతంలో టీవీ 9 సీఈవో రవి ప్రకాష్ పై వ్యక్తిగత విమర్శలు చేసి.. ట్విట్టర్ లో కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఫోటోలు పెట్టి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన తర్వాత కూడా .. జనసేన కార్యక్రమాలకు టీవీ 9లో కవరేజీ వచ్చింది. కానీ … రాజమండ్రి కవాతు విషయంలో మాత్రం పూర్తిగా దూరం పాటించారు. కనీసం.. సమాచారం కూడా ఇవ్వలేదు. అదే దూరాన్ని కంటిన్యూ చేస్తున్నారు. జనసేన కార్యక్రమాల విషయంలో టీవీ 9 పూర్తిగా నిషేధాజ్ఞలు విధించుకోవడం వెనుక ఏం జరిగిందన్న చర్చ అటు రాజకీయ .. ఇటు మీడియా సర్కిల్స్ లోనూ నడుస్తోంది. నిజానికి జనసేన విషయంలో టీవీ 9కి ప్రత్యేకమైన రాజకీయ ఎజెండా లేదు. ఇవ్వాలని కానీ.. వద్దు అని కానీ.. ఏమీ నియమాలు పెట్టుకోలేదు. దానికి తగ్గట్లుగానే… ధవళేశ్వరం కవాతును… కవర్ చేయడానికి టీవీ 9 ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంది. పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని దాదాపుగా అర గంట సేపు లైవ్ గా ఇవ్వాలని అంతర్గతంగా సూచనలు కూడా డెస్క్ కు వెళ్లాయట.

కానీ.. పవన్ కల్యాణ్…తన కవాతు సభ మొత్తాన్ని టీవీ నైన్ లో నిరంతరాయంగా చూపించడానికి… సీఈవోపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారట. తనతో టచ్ లో ఉన్న ఆరెస్సెస్ పెద్దల ద్వారా… టీవీ 9 సీఈవోపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. కొద్ది రోజుల క్రితం.. అమిత్ షా సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు… అప్పటి టీవీ నైన్ యజమానిని ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలోనే కాదు.. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి సిద్ధాంతకర్తగా ఆరెస్సెస్ … మీడియాలో కొన్ని వర్గాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ కోణంలోనే… పవన్ కల్యాణ్… టీవీ 9 సీఈవోపై ఒత్తిడి తెచ్చారని.. తన ప్రోగ్రాం.. మొత్తం కవరేజీ ఇవ్వాల్ననట్లుగా… ఆదేశాల్లాంటి సూచనలు రావడంతో… టీవీ 9 సీఈవో.. మొత్తానికే… అసలు వద్దని చెప్పేశారని… ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ కు సలహాలిచ్చే వ్యక్తుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని.. పవన్ ని ఎవరు నమ్ముతారో.. వారే.. సినిమా ప్రోగ్రామ్స్ మాదిరి మీడియా కవరేజీ ఉండేలా నిర్దేశిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమాలకు డబ్బులిచ్చి పబ్లిసిటీ చేసుకోవచ్చు కానీ.. రాజకీయ కార్యక్రమాలకు మీడియా ఇచ్చే కవరేజీనే మైలేజీ తీసుకొస్తోంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్.. గుర్తించలేకపోతున్నారు. నిజానికి టీవీ నైన్ సీఈవోతో పవన్ నేరుగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమయ్యేది. కానీ ఈగో సమస్య వల్ల మధ్యలో ఆరెస్సెస్ జోక్యం కోరడంతో.. పరిస్థితి మారిపోయింది. రాజకీయ కారణాలతో ప్రసారాలు నిలిపి వేస్తే.. ఏమీ చేయలేరు కానీ.. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ తో మీడియా సంస్థలతో గొడవలు పడితే.. అది జనసేనకే మైనస్ అనేది చాలా మంది రాజకీయ నేతల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close