వెంకీ సినిమా ఎందుకు ఆగిపోయింది?

ఎఫ్ 2తో సూప‌ర్ హిట్ కొట్టిన వెంకీ.. ఆ త‌ర‌వాత సినిమాల ఎంపిక‌లో వేగం చూపించాడు. వెంకీ మామా ప‌ట్టాల‌పై ఉండ‌గానే నాలుగు క‌థ‌ల్ని ఒకే చేసుకున్నాడు. అయితే.. ఆ సినిమాల విష‌యంలో ఇంకా వెంకీ ఓ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాడు. వెంకీ కోసం క‌థ‌లు సిద్ధం చేసుకున్న ద‌ర్శ‌కుల జాబితాలో ఉన్న త్రినాథ‌రావు న‌క్కిన‌.. ఇప్పుడు ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు కూడా. అలా వెంకీ చేతిలోని క‌థ జారిపోయిన‌ట్టైంది. హ‌లో గురు ప్రేమ కోస‌మే త‌ర‌వాత త్రినాథ‌రావు న‌క్కిన తో వెంకీ సినిమా ఓకే అయ్యింది. అప్ప‌ట్లో త్రినాథ‌రావు ఓ లైన్ చెప్ప‌డం, అది వెంకీకి న‌చ్చ‌డం జ‌రిగాయి. అయితే.. ఆ లైన్‌ని క‌థ‌గా డవ‌లెప్ చేయ‌డంలో త్రినాథ‌రావు బాగా ఆల‌స్యం చేశాడు. అంతే కాదు.. ఈ ప్రాజెక్టులోకి సురేష్‌బాబు ఎంట్రీ ఇచ్చాక స‌మీక‌ర‌ణాలు మారాయి.

వెంక‌టేష్ కోసం ఓ పోలీస్ పాత్ర‌ని సృష్టించుకున్నాడు త్రినాథ‌రావు. ఆ క‌థ‌లో ప‌టాస్‌, టెంప‌ర్ ల‌క్ష‌ణాలు మెండుగా క‌నిపించాయ‌ట‌. అంతేకాదు.. ఇందులో పాత్ర‌లో అప‌రిచితుడు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌. కొన్నిసార్లు నిజాయ‌తీప‌రుడిగా, ఇంకొన్నిసార్లు లంచ‌గొండిగా వెంకీ పాత్ర క‌న్‌ఫ్యూజ్ చేస్తుంటుంద‌ని, లైన్‌గా చెప్పిన‌ప్పుడు ఆ పాత్ర బాగున్నా.. ట్రీట్‌మెంట్ పూర్త‌య్యాక కిక్ త‌గ్గింద‌ని, అందుకే క‌థ మార్చ‌మ‌ని త్రినాథ‌రావుని ఫోర్స్ చేయ‌డం ప్రారంభించార‌ని, అది న‌చ్చ‌క త్రినాథ‌రావు ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. అలా.. వెంకీ చేయాల్సిన ఓ సినిమా ఆగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close