పిల్లలే నాకు సర్వస్వం: రేణూ దేశాయ్‌

ఇటీవల “నీతోనే డ్యాన్స్” ప్రోగ్రాం తో టివి ప్రేక్షకులని పలకరిస్తున్న రేణు దేశాయ్ తన గురించి తన కు పవన్ కు ఉన్న అనుబంధం గురించి సందర్భం దొరికినపుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురు ఆద్య తో జరిగిన ఒక భావోద్వేగ సంఘటన పంచుకుంది. నిజంగా ఎంతో ఎమోషనల్ గా ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ఫీలయ్యేలా ఉంది ఆ సంఘటన. కొన్నాళ్ల క్రితం రేణు ‘ఆర్తో ఇమ్యూన్‌ కండిషన్‌’తో బాధపడింది. దీనికి తోడు గుండెకు సంబంధించి ఓ సమస్య తలెత్తటంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో తనకి-కూతురు ఆద్యకి మధ్య జరిగిన ఓ భావోద్వేగ ఘటన గురించి ఆమె వివరించారు.

ఒకరోజు మెడిసిన్‌ ప్రభావం ఎక్కువగా పని చేయటంతో నేను గాఢ నిద్రలోకి వెళ్లిపోయా. స్కూలు నుంచి వచ్చిన ఆద్య నన్ను లేపేందుకు ప్రయత్నించింది. అయితే నాలో చలనం లేకపోవటంతో చనిపోతున్నానేమోనంటూ ఏడ్చేసింది. నాకు మెలకువ వచ్చే సరికి ఎదురుగా ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌ అంటూ ఒకటే ఏడుపు. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ, ఏడిస్తే ఆద్య భయపడుతుందని భావించి నవ్వుతూనే.. నేనేం చనిపోనులే, నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావ్? నేను పోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?” అంటూ చెప్పి ఓదార్చాను అని ఆమె వివరించారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడి ముందు తన కూతురు ఎంత సేపు కూర్చుని ప్రార్థించిందో కూడా తనకు తెలీదని చెప్పిన రేణూ ఈ లోకంలో తన పిల్లలే తనకు సర్వస్వం అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close