ఇతర రాష్ట్రాల టీకాల గ్లోబల్ టెండర్లకు స్పందన..!

ఆంధ్రప్రదేశ్ టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ప్రి బిడ్ సమావేశానికి రెండు కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు. ప్రిబిడ్ భేటీకి వచ్చారంటే.. వారికి టీకాలు సరఫరా చేసే ఉద్దేశం ఉన్నట్లే లెక్క. కానీ ఏపీ సర్కార్.. తమకు బిడ్లు దాఖలు కాలేదని… తమకే కాదని.. ఏ రాష్ట్రానికీ బిడ్లు దాఖలు కాలేదని.. సీఎం జగన్… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది… అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తొమ్మిది రాష్ట్రాలు మొత్తంగా గ్లోబల్ టెండర్లు పిలిస్తే.. ఒక్క ఏపీకి మాత్రమే ఒక్క టెండర్ దాఖలు కాలేదు. మిగిలిన అన్ని రాష్ట్రాలకూ… స్పందన వచ్చింది. చివరికి తెలంగాణకుకూడా.. రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. మహారాష్ట్రకు ఎనిమిది కంపెనీలు స్పందించాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించింది. కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. కొన్ని అంతర్జాతీయ, వివిధ దేశాల కంపెనీలు స్పందించాయి. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ తయారీదారులు టెండర్లు వేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 కంపెనీలకు పైగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంటే… కేవలం రెండు మూడు కంపెనీలు మాత్రమే గ్లోబల్ టెండర్లలో పాల్గొంటున్నాయి. సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన కంపెనీలు గ్లోబల్ టెండర్లలో పాల్గొనే లాగా ప్రచారం కల్పించాలని, ఆయా కంపెనీలు కూడా సమాచారం చేరేలా చూడాలని ఆదేశించారు.

తమిళనాడు ప్రభుత్వం చైనా వ్యాక్సిన్‌ సరఫరాకు కూడా అంగీకారం తెలిపింది. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల గ్లోబల్ టెండర్లకు… పలు సంస్థలు ఆసక్తి చూపాయి. వాటి నుంచి ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేస్తాయా .. వాటికి కేంద్రం అనుమతి ఇస్తుందా.. అన్నది తర్వాత విషయం. కానీ.. జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో ..తమకు స్పందనరాలేదు కాబట్టి.. ఇతర రాష్ట్రాలకు రాలేదన్నట్లుగా రాయడం .. ఆశ్చర్యకరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close