“వరి” పోరాటంలోకి కాంగ్రెస్‌ను లాక్కొస్తున్న రేవంత్ !

తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న వరి రాజకీయం పోరాటంలోకి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెల్లగా కాంగ్రెస్ పార్టీని తీసుకు వస్తున్నారు. ఆ రెండు పార్టీలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక్క సారిగా “కల్లాల్లోకి కాంగ్రెస్” అంటూ రేవంత్ స్పీడ్ పెంచారు. రెండు పార్టీలు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయని.. వారిని బలిపశువులను చేస్తున్నాయని ఆరోపిస్తూ రంగంలోకి దిగిపోయారు. ఇప్పటి వరకూ వరి పోరాటంలో కాంగ్రెస్ వెనుకబడిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఒక్క సారిగా రేవంత్ వ్యూహం మార్చారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్ని తప్పు పడుతూ.. ఎక్కువగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు. మద్యం దుకాణాలకు కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్త దుకాణాలకు టెండర్లు పిలవడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ. పధ్నాలుగు వందల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమైనా.. రాష్ట్రమైనా ధాన్యాన్ని కొనే వరకూ పోరాడతామని ఆయన ప్రకటించారు. రైతులకు భరోసా కల్పించేందుకు పొలాల్లోకే వెళ్తున్ారు.

తెలంగాణ ప్రభుత్వం గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికింది. ఆ తర్వాత ధాన్యం సేకరణ కేంద్రాలను ఎత్తివేస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఈటల రాజేందర్ వంటి వారు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పలేదని మాట మార్చింది.అయితే ధాన్యం సేకరణ అరకొరగా చేస్తోంది.ఈ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు మీ వల్ల అంటే మీ వల్లేనంటూ టీఆర్ఎస్ , బీజేపీ రాజకీయం చేసుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close