ఆ ఒక్కడు గెలిస్తే రాజన్న రాజ్యం వస్తుందా?

వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్ తరపున ఎమ్మెల్యే రోజా చేస్తున్న ఎన్నికల ప్రచారం చాలా ముచ్చటగా ఉంది. ఈ ఎన్నికలలో బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పునే వరంగల్ ప్రజలు కూడా ఇవ్వాలని కోరడంతో పక్కనే ఉన్న వైకాపా అభ్యర్ధి తెల్లమొహం వేయవలసి వచ్చింది. ఎందుకంటే బిహార్ లో ప్రజలు అధికార కూటమికే ఓట్లు వేసి గెలిపించారు. అంటే వరంగల్ ఉప ఎన్నికలలో అధికార తెరాసకే ఓట్లు వేయమని రోజా కోరుతున్నట్లుంది. మోడీ అహంకారానికి బిహార్ ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో అదేవిధంగా అహంకారం ప్రదర్శిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని ఆమె ఉద్దేశ్యం కానీ ప్రజలకు అది మరోలా వినిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణాలో మొత్తం 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు అయినా తెరాస ప్రభుత్వం స్పందించలేదు,” అని ఆమె విమర్శించినపుడు కూడా జనాలు ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు. రైతుల ఆత్మహత్యలను తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిస్తున్న రోజా, ఆ సమస్యపై తమ పార్టీ కూడా ఏనాడూ నోరు విప్పి మాట్లాడలేదనే సంగతి గ్రహించినట్లు లేరు. అందుకే జనాలు నవ్వుకొంటున్నారు.

ఇంతకాలం తెరాస ప్రభుత్వానికి తమ పార్టీ వలన ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే వైకాపా నేతలు ప్రజా సమస్యలపై పోరాడలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు, పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల గురించి తెరాస ప్రభుత్వాన్ని రోజా నిలదీస్తున్నారు. తెలంగాణాలో గడప గడపలో రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పధకాలే కనిపిస్తున్నాయని వరంగల్ ప్రజలకు రాజన్న ఋణం తీర్చుకొనే అవకాశం వచ్చిందన్నారు. కనుక మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేయాలని రోజా కోరారు. రాజశేఖర్ రెడ్డి హయంలోనే తెలంగాణా అత్యంత ఎక్కువగా దోపిడీకి గురయిందని తెలంగాణా ప్రజలు భావిస్తుంటే, వారు ఆయనకి రుణపడి ఉన్నారని దానిని తీర్చుకోవాలని కోరడం చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణా రాష్ట్రంలో వైకాపా తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం కూడా చేయడం లేదు. అటువంటప్పుడు ఒకే ఒక్క వైకాపా ఎంపీని ఎన్నుకొంటే రాజన్న రాజ్యం ఏవిధంగా వస్తుందో ఆమెకే తెలియాలి. ఒకవేళ వైకాపా అభ్యర్ధి గెలిచినా ఏదో ఒకనాడు తెరాసలో చేరిపోవడం మాత్రం ఖాయం. గత అనుభవాలను చూసినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. అటువంటప్పుడు వైకాపా అభ్యర్ధికి ఓటేయడం కంటే అదేదో తెరాస అభ్యర్ధికే వేస్తే సరిపోతుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close