యధా జగన్…తధా రోజా?

యధారాజా తధాప్రజా అనే సూక్తిని వైకాపాకి అన్వయించుకొన్నట్లయితే యధా జగన్ తధా వైకాపా అని చెప్పుకోవచ్చు. ఆ మాటకొస్తే దేశంలో అన్ని పార్టీలకి అదే సూత్రం వర్తిస్తుంది. కనుక యధా అధినేత తధా పార్టీ నేతలు అని జనరల్ గా చెప్పుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటే, ఆ పార్టీ నేతలు కూడా ఆయన బాటలోనే నడుస్తూ నోటికి పని చెపుతుంటారు.

ఈ విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాటి మహిళా ఎమ్మెల్యే అనిత పట్ల అనుచితంగా మాట్లాడి ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకి వెళ్ళినా అక్కడా ఆమెకి మొట్టికాయలే పడ్డాయి. అయినా ఆమె తీరు మారలేదు. వైకాపాలో ఉన్నంత కాలం బహుశః ఆమె తీరు మార్చుకోబోరని చెప్పవచ్చు.

ప్రత్యేక హోదా కోరుతూ నిన్న తిరుపతిలో వైకాపా నిర్వహించిన ధర్నాలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ముసుగులో గ్యాంగ్ స్టర్ నయీం కంటే దారుణమైన అరాచకాలు చేయిస్తున్నారని రోజా ఆరోపించారు. ఓటుకి నోటు కేసు నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాని మోడీ పాదాల వద్ద పెట్టి శరణుకోరి రాష్ట్ర ప్రయోజనాలని ఘోరంగా దెబ్బ తీశారని ఆరోపించారు. తాను నిప్పులాంటి మనిషినినని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఇంతవరకు 18కేసులలో స్టే తెచ్చుకొన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకి అమరావతి బొమ్మలు చూపిస్తూ అమరావతిని భ్రమరావతిగా మార్చేశారని విమర్శించారు. తెదేపా రాజ్యసభ సభ్యులలో ఒకరు బ్యాంక్ దొంగ..మరొకరు సారా కేసులో దొంగ అని విమర్శించారు.

ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి వైఖరిని ఆమె మాత్రమే కాదు రాష్ట్రంలో చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ రోజా హద్దులు మీరి విమర్శిస్తున్నారు. అంతే తేడా. రాష్ట్రానికి పెద్దదిక్కు వంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక క్రిమినల్, నరహంతకుడు నయీంతో పోల్చడం, ఆయన కూడా అంతకంటే దారుణాలకి పాల్పడుతున్నారని ఆరోపించడం చాలా దారుణం. ముఖ్యమంత్రి గురించి ఈవిధంగా అనుచితంగా మాట్లాడినందుకు తెదేపా నేతలు కోర్టులో కేసు వేస్తే, రోజా మళ్ళీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాక తప్పదు.

ఓటుకి నోటు కేసులో ముఖ్యమంత్రి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం నేరం అన్నట్లుగా మాట్లాడుతున్న ఆమె, 11 చార్జ్-షీట్స్ లో ఏ-1 ముద్దాయిగా పేర్కొనబడి జైలుకి కూడా వెళ్లి బెయిల్ పై బయటకి వచ్చిన తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకొంటున్నారో అదే నోటితో చెపితే బాగుంటుంది కదా.

రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, సుజనా చౌదరిపై అవినీతి ఆరోపణలు ఉన్నమాట నిజమే. కానీ ఆ విషయం గురించి మాట్లాడటానికి కూడా సరైన బాష, సరైన పదాలు వాడటం మంచిది. లేకుంటే వారు కూడా ఆమెని కోర్టుకీడ్చే అవకాశాలున్నాయి. రాజకీయాలలో ఉన్నవారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు చాల ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం లేకుంటే వారే చిక్కులో పడతారు. రోజాకి ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి ఆ అనుభవం ఎదురైంది కూడా. కానీ ఆమెలో మార్పు ఏమీ కనబడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close