రూ 1993 కోట్లతో “స్మార్ట్”కాకినాడ!

యూజర్ చార్జీలకు ప్రజలు సిద్ధమైపోవాలి మరి!!

స్మార్ట్ సిటి కోసం ఖర్చయ్యే నిధుల్లో దాదాపు 25 శాతం మాత్రమే కేంద్రం నుంచి గ్రాంటుగా వస్తుంది. కేంద్రప్రభుత్వం నుంచి, రాష్ట్రప్రభుత్వం నుంచీ వచ్చే రెగ్యులర్ నిధులను స్మార్ట్ సిటీ ఖాతాకు మళ్ళించి, ప్రయివేట్ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకుని, యూజర్ చార్జీలు విధించుకునీ, అప్పులు చేసీ మిగిలిన నిధులను సమకూర్చుకోవాలి.ఇంతేకాకుండా పనులఅజమాయిషీకోసం ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ వ్యవస్ధ మున్సిపల్ కార్పొరేషన్ కు సమాతంతర పాలనా వ్యవస్ధ కాగల అవకాశం కూడా వుందని కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రిపోర్టు వివరాలను బట్టి అర్ధమౌతోంది.

కాకినాడను స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేయడానికి 1993 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కేంద్రకేబినెట్ సెక్రెటరీ ప్రదీప్‌కుమార్‌ సిన్హా కు ఈ విషయం వివరించారు.

స్మార్ట్ సిటీల రూపకల్పన కోసం ప్రభుత్వ నిధులుపైనే ఆధారపడకుండా స్థానికంగా యూజర్ ఛార్జీల వసూలు, పబ్లిక్‌ ప్రయివేట్‌ భాగస్వామ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కన్వర్జెన్స్‌ ద్వారా నిధుల సమీకరణకు కృషి చేయాలని ఒక వీడియో కాన్ఫరెన్సులో సిన్హా సూచించారు.

దేశ వ్యాప్తంగా మొదటి విడతగా ఎంపిక చేసిన 20 స్మార్ట్ నగరాల్లో ఆంధ్రప్రదేశ్ లోనే రెండు (విశాఖ, కాకినాడ) వున్నాయి. అందులో కాకినాడ వివరాలను కలెక్టర్ చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు – హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌, ఆర్‌అండ్‌బి, కల్చర్‌, ఎనర్జీ, రంగాల్లో రూ.244 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.488 కోట్లు, స్మార్ట్‌ సిటీ నిధులు రూ.488 కోట్లు, రుణం రూ.140 కోట్లు, వాణిజ్యపరంగా అవకాశాలున్న ప్రయివేట్ భాగస్వామ్యంలో రూ.174 కోట్లు, కాకినాడ నగరపాలక సంస్థ సొంత నిధులు రూ.73 లక్షలు, సిఎస్‌ఆర్‌ నిధులు రూ.2.50 కోట్లు కలిపి మొత్తం రూ.1,993 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని వివరించారు.

స్మార్ట్ సిటీలో వెంటనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పివి)ని ఏర్పాటు చేసుకుని పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ సెక్రెటరీ ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close