ఇంత జ‌రుగుతున్నా… ర‌జ‌నీ నోరు మెద‌ప‌డేం?

ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ఇది వ‌రకెప్పుడూ లేనన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. ర‌జ‌నీకాంత్ ఇటీవ‌లే అమెరికా వెళ్లారు. విహార‌యాత్ర‌కు అని కుటుంబ స‌భ్యులు చెబుత‌న్నా.. ర‌జ‌నీ ఆరోగ్యం క్షీణించింద‌ని, ఆయ‌న కిడ్నీలు పాడ‌య్యాయ‌ని, కిడ్నీల మార్పుకు సంబంధించిన ఆప‌రేష‌న్ జ‌రిగింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. దీనిపై ర‌జ‌నీగానీ, ఆయ‌న‌కుటుంబ స‌భ్యులు గానీ ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ తొలిసారి ర‌జ‌నీ ఆరోగ్యంపై స్పందించాడు. ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అమెరికాలో కొన్ని వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొంటున్నార‌ని, త్వ‌ర‌లోనే చెన్నై తిరిగొస్తార‌ని, క‌బాలి ప్ర‌మోష‌న్ల‌లోనూ పాల్గొంటార‌ని క్లారిటీ ఇచ్చారు.

వైద్య ప‌రీక్ష‌లు అన‌గానే… ఫ్యాన్స్ లో మ‌ళ్లీ అల‌జ‌డి రేగింది. అయితే ర‌జ‌నీ క‌చ్చితంగా అనారోగ్యం పాలై ఉంటార‌ని ర‌జ‌నీ ఫ్యాన్స్ బెంగ పెట్టుకొంటున్నారు. ర‌జ‌నీ క‌బాలి ప్ర‌మోష‌న్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే అన్న‌ది లేటెస్ట్ టాక్‌. రోబో 2 షూటింగ్‌కీ సుదీర్ఘ‌మైన విరామం ప్ర‌క‌టించార‌ని ర‌జ‌నీ మ‌ళ్లీ ఎప్పుడు సెట్లోకి వ‌స్తారో తెలీద‌ని కూడా చెబుతున్నారు. ఇన్ని గాసిప్పులు వినిపించినా ర‌జ‌నీ మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు. క‌నీసం బాగానే ఉన్నానంటూ ఒక్క వీడియో మెసేజ్ కూడా పంపండం లేదు. ర‌జ‌నీ ప్ర‌స్తుత ఆరోగ్య‌ప‌రిస్థితి గురించి చెప్ప‌డానికి ఎవ్వ‌రూ అందుబాటులో లేరు. దాంతో ఫ్యాన్స్ మ‌రింత భ‌య‌ప‌డుతున్నారు. ర‌జ‌నీ ఎప్పుడొస్తాడో… అప్పుడే ఈ భ‌యాల‌న్నీ తొల‌గిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close