రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన సమయానికి కాకుండా..నెలల తరబడి ఆలస్యం అవుతోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ సహా అన్నీ ఆలస్యంగానే ఇస్తున్నారు. తాజాగా రైతు భరోసా కూడా మిస్ అయింది. అధికారంలోకి వ్రతి ఏడాది మేలో పన్నెండున్నరవేలు ఒకే సారి ఇస్తానని హామీ ఇచ్చారు. చివరికి మాట మార్చారు. ఇప్పుడు ఆర్థిక సమస్యలతో అది మేలో కూడా ఇవ్వడం లేదు.

ముఫ్పైవ తేదీన బటన్ నొక్కడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదోనిలో సభా ఏర్పాట్లుకూడా చేశారు.కానీ ఖజానాలో నిధుల్లేకపోవడంతో రెండు రోజులకు వాయిదా వేశారు.దీంతో జూన్ నెలకు వెళ్లిపోయింది. అంటే జూన్ లో బటన్ నొక్కుతారు. నిజానికి జూన్ లో అమ్మఒడికి బటన్ నొక్కాల్సి ఉంది.దానికి ఆరున్నర వేల కోట్ల వరకూ కావాలి. నిజానికి పది రోజుల కిందటే కేంద్రం రూ. పది వేల కోట్ల నిధులు ఇచ్చింది. అవన్నీ ఏమయ్యాయో.. రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. ప్రతీ వారం రెండు వేల కోట్లు తీసుకు వస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుమతి ఇచ్చిన అప్పులో సగం ఇప్పటికే తీసేసుకున్నారు. కానీ రెండు నెలలు కూడా కాలేదు.

ప్రభుత్వం ఇంకా అనేక పథకాలకే కాదు.. చాలా బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటికి వేల కోట్ల నిధులు కావాలి. కేంద్రం ఇచ్చిన రూ. పది వేల కోట్లు ఎవరికి సర్దుబాటు చేశారో తేలాల్సి ఉంది. వచ్చే నెల కూడా సమయానికి జీతాలివ్వకపోతే ఉద్యోగులు తిరగబడే ప్రమాదం ఉంది. ప్రతీ వారం అప్పులు తెచ్చుకుంటూ.. కేంద్రం వేల కోట్ల ఇస్తున్నా.. జీతాలివ్వకపోతే ముందు ముందు పరిస్థితి దారుణంగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను ఓ పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన

నటి పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాజకీయ దుమారం రేపాయి. పూనమ్ ఓ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి....

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close