బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిన సాధ్వీ..! “దేశభక్త” ఇమేజ్‌కు దెబ్బపడిందా..?

బీజేపీలో చేరిన ఒక్కరోజులోనే భోపాల్ లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశాన్ని పొందిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆ పార్టీకి ఎక్కడ లేని చిక్కులు తెచ్చి పెట్టారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా జైలుకెళ్లి బెయిల్ పొందిన సాధ్వీ ముంబై ఉగ్రదాడిలో ముష్కరులతో పోరాడుతూ అమరుడైన హేమంత్ కర్కరేను ఆమె అనరాని మాటలు అన్నారు. నాశనమైపోతావంటూ తాను శాపం పెట్టానని, సరిగ్గా 45 రోజులకు తన శాపం తగిలి కర్కరే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతిలో మరణించారని కసిగా చెప్పారు. సాధ్వీ ప్రజ్ఞ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. సాధ్వీ లాంటి వ్యక్తులకు టికెటిచ్చిన బీజేపీ తీరును సైతం తప్పు పడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.

ముంబైలో ఉగ్రదాడిని జనం గుర్తుచేసుకుంటున్నారు. ఉగ్రవాదులతో పోరాడుతూ కర్కరే ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటున్నారు. దేశభక్తికి కేర్ ఆఫ్ అడ్రస్‌ గా చెప్పుకునే బీజేపీలో సాధ్వీ ప్రజ్ఞకు ఎలా స్థానం కల్పించారని జనం ప్రశ్నిస్తున్నారు. హిందూత్వను దివిటీ పట్టుకుని నడిపించే నేతలుగా చెప్పుకునే బీజేపీ, హేమంత్ కర్కరే భారతీయుడన్న సంగతి గుర్తు లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి నేరస్తులతో పోరాడతారని తెలిసి కూడా సాధ్వీ అలాంటి వ్యాఖ్యలు చేయడం పలువురు పోలీసు అధికారులు తప్పుపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సాధ్వీ పట్ల, బీజేపీ పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆమెను వెంటనే పోటీ నుంచి విరమించజేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొందరు నేతలను కట్టడి చేయడంలో బీజేపీ అధిష్టానం విఫలమైనందునే ఇప్పుడు సాధ్వీ లాంటి వారు రెచ్చిపోతున్నారని జనం గుర్తు చేస్తున్నారు.

ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సాధ్వీ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేసింది. ఉగ్రవాదులతో పోరాడుతూ మరణానంతరం అశోక్ చక్ర పొందిన హేమంత్ కర్కరేను అవమానపరచడం గర్హనీయమని ఐపీఎస్ అధికారులు అంటున్నారు అమరులను గౌరవించడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరో పక్క బీజేపీ తన నైజాన్ని నిరూపించుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కమలం పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అది సాధ్వీ వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించింది. ఇంత జరిగిన తర్వాతే సాధ్వీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు మరిన్ని వివాదాలకు అవకాశమిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close