‘సితార..’లో సినిమాలకు మాత్రమే ఎందుకిలా?

ఆదివారం హడావుడిగా నాగచైతన్య సినిమా నిర్మాణ సంస్థ ఓ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వంలో చైతన్య హీరోగా నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ వారం రోజుల్లో విడుదల చేస్తామని, ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నదని ఫేక్ లుక్ అనీ!

నితిన్ హీరోగా త్వరలో సినిమాలో చేయనున్న వెంకీ కుడుములు ఈ రోజు ఒక ట్వీట్ చేశారు. “ప్లీజ్… మేం వచ్చేవరకూ సహనంతో ఎదురు చూడండి. ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా. పుకార్లను నమ్మవద్దు. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోన్న లోగో ఫేక్. ప్రతి విషయాన్నీ త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం” అని వెంకీ కుడుములు ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఛలో’తో దర్శకుడిగా పరిచయమైన ఈ యువకుడు, వెంటనే నితిన్ హీరోగా సినిమా చేయడానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భీష్మ’ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే పేరుతో లోగో డిజైన్ చేసి నెట్టింట్లో వదిలారు. అది కాస్తా కాసేపు ట్రెండ్ అయ్యింది. వెంటనే దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

రెండు రోజుల్లో రెండు సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయా సినిమాలకు చెందిన సభ్యులు వివరణ ఇచ్చారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే… రెండు సినిమాలకూ నిర్మాత ఒక్కరే. సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మాతగా రూపొందుతోన్న సినిమాలు ఇవి. త్రివిక్రమ్ దర్శకుడిగా వరుస సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సంస్థకు అనుబంధ సంస్థ ఇది. తమ సినిమాలో హీరో లుక్కు, తమ సినిమా లోగో ఒక్కొక్కటిగా వస్తుంటే ఫేక్ అని స్పష్టం చేస్తున్నారు. ‘సితార…’లో సినిమాలకు మాత్రమే ఎందుకిలా జరుగుతోందో? నిర్మాతలే కావాలని ఈ విధంగా చేస్తున్నారని ఓ పక్క విమర్శలు వస్తున్నాయి. అందుకని జాగ్రత్త పడితే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close