పవన్‌ను బ్రోకరంటున్న వైసీపీ !

పవన్ కల్యాణ్‌ విషయంలో వైసీపీ కంగారు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎంత దారుణమైన మాటలకైనా దిగజారిపోతోంది. తాజాగా ఆయనను బ్రోకర్ దారుణంగా వ్యాఖ్యానించారు ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బ్రోకరిజం చేస్తున్నట్లుగా ఉందని ప్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, జనసేన పొత్తుల గురించి మాకు సంబంధం లేదంటూనే పవన్‌పై వ్యాఖ్యలు చేశారు.

అదే సమయంలో పవన్ ఒంటరిగా పోటీ చేయాలనే తన కోరికను సజ్జల చెప్పకనే చెప్పారు. రాజ‌కీయంగా సీరియస్‌గా ఉన్న వాళ్లు ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని అనుకుంటార‌ని స‌జ్జ‌ల చెప్పుకొచ్చారు. జ‌న‌సేన త‌న పార్టీ అన్న విష‌యాన్ని ప‌వ‌న్ మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నార‌ని చంద్ర‌బాబు వ్యూహాల‌నే ప‌వ‌న్ వ‌ల్లె వేస్తున్న‌ట్లుగా అనిపిస్తోంద‌ని ఆవు కథ చెప్పుకొచ్చారు. పొత్తుల‌పై ప‌వ‌న్ ఓ మాట‌, జ‌న‌సేన‌తో పొత్తు క‌లిగిన బీజేపీ నేత‌లు మ‌రో మాట మాట్లాడుతిన్నార‌ని అంతా గేమ్ ప్లాన్ తో ఆయన చెప్పుకొస్తున్నారు.

ఇతర పార్టీలు ఎలా పొత్తులు పెట్టుకుంటే వైసీపీకి ఏం నొప్పో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అవసరమైతే ఆయనపై రాజకీయంగా.. సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలను వైసీపీ నేతలు చేస్తున్నారు. అందులో సజ్జల కీలకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close