శాశ్వత అధ్యక్ష పదవిని జగన్ తిరస్కరించారట !

కిందపడినా మాదే పైచేయి అని దులిపేసుకోవడంలో వైసీపీ నేతలను మించిన వాళ్లు లేరు. తాము ఏమి చెప్పినా .. చివరికి కళ్ల ముందు జరిగింది కూడా నమ్మకుండా తాము ఏమి చెబితే అది నమ్మెసే వాళ్లు ఉన్నారని.. దేనికీ తగ్గడం లేదు. వైసీపీకి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంలోనూ వారిది అదే పంథా.

ప్లీనరీలో జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత జగన్ ను అందరూ కీర్తించారు. ఆయన ఒక్కడు సింహాసనంలో కూర్చుంటే అందరూ కలిసి సన్మానం చేశారు. షిక్కటి చిరునవ్వుతో జగన్ శాశ్వత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రజాస్వామ్యంలో శాశ్వత పదవులు ఉండవని.. ఇదేం పని అని ఈసీ ఘాటుగా లేఖ రాయడంతో వెంటనే మాట మార్చేశారు. ఆ పదవిని జగన్ తిరస్కరించినందున.. ప్లీనరీ మినిట్స్ లోకి ఎక్కించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాత్రం మొహమాటం లేకుండా మీడియా ముందు వ్యాఖ్యానించేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారని ..అందు వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదని చెప్పుకొచ్చారు.ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షుడిగా ఉంటారని సజ్జల తెలిపారు. గతంలో ఇదే సజ్జల.. విజయసాయిరెడ్డి .. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని అడ్డగోలుగా సమర్థించారు. ఇప్పుడు .. తేడా వచ్చే సరికి.. కవర్ చేసుకోవడానికి వాళ్లను నమ్మే ప్రజల్ని అదో రకంగా భావిస్తూ స్టేట్‌మెంట్లిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close