విజయసాయి మాటల్ని కప్పి పుచ్చిన “సాక్షి”..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార గెజిట్ లాంటి… సాక్షి పత్రిక… ఆ పార్టీ నేతల ప్రకటనలను కూడా .. ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ… కొత్త తరహా జర్నలిజాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది. రాజధాని మార్పుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోదంని.. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనను.. సాక్షి పూర్తిగా పక్కన పెట్టేసింది. పత్రికలో.. టీవీలో కూడా.. చోటివ్వలేదు. ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టు… విజయసాయిరెడ్డి చేసిన.. ఓ కీలకమైన ప్రకటనకూ.. అదే తరహా ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఏపీలో తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలన్నింటినీ… మోడీ , షాలకు చెప్పే తీసుకుంటున్నామని.. ఢిల్లీలో ఆయన మీడియాకు.. నిర్మొహమాటంగా చెప్పారు. ఈ వార్తను.. సాక్షి పత్రిక.. పూర్తిగా హైడ్ చేసింది. రైల్వే మంత్రిని కలిసిన వార్తలో.. ఒక్క లైన్‌గా రాసి.. కనపడనివ్వకుండా చేసింది.

పీపీఏల సమీక్ష, పోలవరం రివర్స్ టెండర్లపై… కేంద్రం నుంచి.. తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. పదే పదే లఖలు కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో… తాము మోడీ, షాలకు చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంటే… వైసీపీ ఈ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నట్లే. అయితే… సాక్షి పత్రిక మాత్రం… ఈ వార్తకు ప్రాధాన్యం కల్పించలేదు. అసలు విజయసాయిరెడ్డి.. ఢిల్లీలో … కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన వార్తకే ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన ఫోటో కూడా.. వేయలేదు. చివరి పేజీలో మాత్రమే.. ఈ వార్తకు చోటు కల్పించారు. అందులోనూ… రైల్వేకు సంబంధించిన వినతిపత్రంలో ఉన్న విషయాలనే ప్రస్తావించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… తమ పత్రికలో ప్రాధాన్యం ఇవ్వలేదంటే.. కేవలం అది.. రాజకీయం కోసం చేసిన ప్రకటనగా భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. తమ నిర్ణయాలను కేంద్రం.. వ్యతిరేకిస్తోందన్న భావన రాకుండా ఉండటానికే.. విజయసాయిరెడ్డి ఇలాంటిప్రకటన చేసి.. ఇతర మీడియా ద్వారా ప్రజల్లోకి పంపారని.. తమకు సంబంధం లేదని తప్పించుకోవడానికి సాక్షిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదన.. వినిపిస్తోంది. మొత్తానికి సాక్షి పత్రిక కూడా.. వైసీపీ రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా… కవరేజీని మార్చుతూ… సరికొత్త జర్నలిజాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప సవాల్ – అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ !

కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున...

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close