ఈ “సాక్షి “కి ఏమైంది: కెఎ పాల్ కి కూడా వైఎస్ఆర్ సీపీ భయపడుతోందా?

థియేటర్లలో సినిమా మొదలెట్టే ముందు ఈ నగరానికి ఏమైంది అంటూ వేసే యాడ్ విపరీతంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సాక్షి పత్రిక, టీవీ చూస్తుంటే , అసలు ఈ సాక్షి కి ఏమైంది అనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా జనసేన మీద విపరీతమైన వ్యతిరేక కథనాలు రాస్తూ, తమ అభద్రతా భావాన్ని బయటపెట్టుకున్న సాక్షి , ఇప్పుడు కేఏ పాల్ మీద కూడా బలమైన కథనాలు ప్రసారం చేస్తోంది.

వివరాల్లోకి వెళితే, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల పేర్ల కు దగ్గరగా పేర్లు కలిగిన నాయకులను పోటీకి నిలబెట్టాడని, తమ పార్టీకి తమ అభ్యర్థుల కి గండికొట్టడానికి కావాలనే ఈ విధంగా చేస్తున్నాడని సాక్షి కథనం ప్రసారం చేసింది. రాయదుర్గంలో వైఎస్ఆర్సిపి కాపు రామచంద్రారెడ్డిని నిలబడితే, ప్రజాశాంతి పార్టీ ఉండాల రామచంద్రారెడ్డి ని నిలబెట్టింది. ఉరవకొండలో వైఎస్ఆర్ సీపీ విశ్వేశ్వర్రెడ్డి నిలబడితే, ప్రజాశాంతి పార్టీ విశ్వనాథరెడ్డి నిలబెట్టింది. అనంతపురంలో వైఎస్ఆర్సిపి అనంత వెంకటరామిరెడ్డి నిలబెడితే, ప్రజాశాంతి పార్టీ పగడి వెంకట్రామిరెడ్డిని పోటీకి నిలబెట్టింది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు లో అయితే అదే పేరు ఉన్న నంబూరు శంకరరావు అనే వ్యక్తిని నిలబెట్టింది. దాదాపు 9 స్థానాల్లో ఈ విధంగా అభ్యర్థులను నిలబెట్టింది ప్రజాశాంతి పార్టీ.

అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా, వైయస్సార్ ఇదే స్ట్రాటజీని ఉపయోగించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వ్యక్తులు ఇండిపెండెంట్గా చాలా స్థానాలలో పోటీకి నిలబడ్డారు. అప్పట్లో వీరిని ప్రోత్సహించి నిలబెట్టింది వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని చాలా మందికి తెలుసు. వీరిలో చాలామంది 1000 పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ 2-3 స్థానాలను ఈ గ్యాప్ తో కోల్పోయింది. బహుశా అందుకే జగన్ కి , కే ఏ పాల్ అభ్యర్థుల కారణంగా ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. పైగా వైయస్సార్సీపి ఫ్యాన్ గుర్తు కి, ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తుకి ఉండే రెక్కల కారణంగా ఈవీఎం మిషన్లో లో కూడా ఓటర్లు కొంత అయోమయానికి గురి అయ్యే అవకాశం ఉంది.

మొత్తానికి ఈ కారణంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ప్రస్తుతం వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు అనే చెప్పాలి. అయితే అధికారం వై ఎస్ ఆర్ సి పి దేనని ఢంకా బజాయించి చెబుతున్న సాక్షి ,పాల్ కి ఈ రేంజిలో భయపడటమే జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close