“ఎన్టీఆర్ మూవీ యూనిట్ మూడు గంటల పాటు చంద్రబాబుతో సమావేశం అవడంతో.. తెలుగు ప్రజలు షాక్కు గురయ్యారు..” ఇదీ … క్రిష్, బాలకృష్ణ, రానా చంద్రబాబుతో భేటీ గురించి సాక్షి దినపత్రిక గుర్తించిన విషయం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనన్నప్పుడు కూడా.. తెలుగు ప్రజలు ఇంత షాక్కు గురి అయి ఉండరేమో అన్నంత అతిశయోక్తిని కథనంలో చొప్పించారు. ఎన్టీఆర్ మూవీలో.. చంద్రబాబు పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్నారు. కొన్ని సూచనల కోసం.. దర్శకుడు క్రిష్, బాలకృష్ణలతో కలిసి ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇదే సాక్షి పత్రికకు…” మూల కథ” మారిపోయేంత ఘటనగా తోచింది.
ఎన్టీఆర్ సినిమాకు బాబు డైరక్షన్ అంటూ.. అసలు విషయం కంటే.. కొసరు విషయానికే ప్రాధాన్యత ఇచ్చింది. అంతకు ముందు..కథాంశాన్ని సాక్షి దినపత్రిక ఫైనల్ చేసిటన్లు.. దాన్ని చంద్రబాబు… క్రిష్, బాలకృష్ణ, రానాలతో జరిగిన తన మూడు గంటల.. భేటీలో మొత్తాన్ని రివైజ్ చేసినట్లు ఊహించేసుసుకున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని విషాద ఘటనలు వక్రీకరిస్తారని డిసైడైపోయారు. అంతులేని ఆవేదన చూపించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని రంగరించారు.
ఎన్టీఆర్ బయోపిక్ను తాము డైరక్ట్ చేస్తేనే న్యాయం జరుగుతుందన్నట్లు ఉంది… సాక్షి దినపత్రిక వ్యవహారం. ఏమేమి ఉండవో అంటూ. .. కొన్ని ఘటనలను కూడా ఉదహరించారు. అసలు బయోపిక్ అంటేనే… భావితరాలకు స్ఫూర్తి అందించేందుకు నిర్మించేది. ఆ వ్యక్తుల విషాద ఘట్టాలు, వైఫల్యాలు ఎవరూ చూపించరు. ఆ విషయం తెలియనంత అమాయకులేమీ కాదు.. సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్. కానీ ముందుగా.. బయోపిక్ మీద ఏదో ఒకటి చల్లేయాలి కాబట్టి… రాసేస్తే సరిపోతుందని…ఏ మాత్రం లాజిక్లు లేకుండా… పాఠకుల్ని అమాయకుల్ని చేసేస్తోంది. వైఎస్ఆర్ బయోపిక్గా తెరకెక్కుతున్న “యాత్ర” మూవీలో… పావురాల గుట్ట ఎపిసోడ్ ఉంటుందా..? . వైఎస్ జగన్ సంతకాల సేకరణ ఉద్యమాన్ని పెడతారా..?..అలా పెట్టాలని ఎవరైాన డిమాండ్ చేస్తారా..? చేసిన వాళ్లని.. ఏమనుకుంటారు..?. సాక్షిని కూడా అదే అనుకోవాలేమో.. ?