సాక్షికి టీడీపీ నేతలందరూ కరోనా రోగులే..!

తెలుగులో ఓ సామెత ఉంటుంది.. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధికారిక మీడియా ఎప్పుడూ ఈ సామెతను ప్రస్తావిస్తూ ఉంటుంది. టీడీపీ రంగు పసుపును పచ్చగా అభివర్ణిస్తూ… ఇంకా ఎక్కువ వాడేస్తూ ఉంటుంది. ఇప్పుటు పచ్చ కామెర్ల సంగతేమో కానీ..సాక్షి మీడియాకు మాత్రం… టీడీపీ నేతలందరూ కరోనా రోగుల్లాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్న వారందరికీ కరోనా ఉందని సాక్షి మీడియా ప్రచారం చేస్తోంది. టీవీల్లో బ్రేకింగ్‌లు వేసి మరీ హంగామా చేస్తోంది. దీంతో టీడీపీ నేతలు… సాక్షి మీడియాపై దారుణమైన భాషలో విరుచుకుపడుతున్నారు.

టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగపూడి అనిత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తిరుపతి ప్రచారంలో ఉన్నారు. అయితే వారికి కరోనా వచ్చిందని… తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం అని సాక్షి మీడియా హడావుడి చేసింది. అయితే సాక్షి మీడియా ప్రచారం చేసిన వారిలో ఎప్పుడో కరోనా వచ్చి ఇప్పుడు తగ్గిపోయిన జవహర్ లాంటి వారు ఉన్నారు. అలాగే అసలు కరోనా పాజిటివ్ రాని అనిత, గుమ్మడి సంధ్యారాణి కూడా ఉన్నారు. సాక్షిలో తమ పేర్లతో .. తమకు కరోనా అని ప్రచారం చేయడంపై వారు మండిపడ్డారు. సిగ్గూ, లజ్జా లేకుండా మీడియాను నడుపుతున్నారని తిట్లు లంకించుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని కరోనా కారణంగా వాయిదా వేసుకుంటున్నానని ప్రకటించారు. దీనికి బలం కల్పించడానికి టీడీపీ నేతలందరికీ కరోనా అని సాక్షి జర్నలిస్టులు క్రియేట్ చేసినట్లుగా ఉన్నారు. మీడియా అంటే.. తప్పుడు వార్తలు రాసి.. ప్రజల్లోకి ఏదో ఓ రకమైన తప్పుడు ప్రచారం పండానికే అన్నట్లుగా వైసీపీ మీడియామారిపోయిందని.. నిజం ఉందో లేదో కానీ… నమ్మేవారు నమ్ముతారన్న ఉద్దేశంతో సాక్షి ఇలాంటి వార్తలు వండి వారుస్తోదని అంటున్నారు. మొత్తానికి ఎక్కువ మంది నమ్మేదే నిజమని సాక్షి అనుకుంటోంది. ఆ ప్రకారం…తాను అనుకున్నదాన్ని ప్రచారం చేసి ఎక్కువ మందిని నమ్మించాలని అనుకుంటోంది. అదే జరుగుతోంది. అక్కడ జర్నలిజం విలువలు… మట్టి..మశానం వంటి వాటికి చాన్స్ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close