సాక్షిలో సెంటిమెంట్ కథలు..! పిండేస్తున్నారంతే..!!

సాక్షి పత్రికలో చేయి తిరిగిన సెంటిమెంట్ రచయితలకు కొదువ లేదు. జగన్ పాదయాత్ర పులివెందులలో ప్రారంభించిన తర్వాత వారి తమ తమ పెన్ పవర్ చూపించారు. జగన్‌ను చూసే వరకూ… అన్నం తినేది లేదన్న మూడేళ్ల పాప ప్రతిజ్ఞ దగ్గర్నుంచి.. ఆరేళ్ల బాబుకు జగన్ పేరు పెట్టడం వరకూ.. రకరకాలుగా… విభిన్న వ్యాకరణంతో.. జగన్ పై ప్రజలకు అభిమానాన్ని సెంటిమెంట్‌ రూపంలో పాఠకుల ముందు ఉంచేందుకు నానా విన్యాసాలు చేశారు. మధ్యలో ఓవర్ అయిపోయిందేమోనని కొద్దిగా ఇలాంటి స్టోరీల్లో “సెంటిమెంట్ గాఢత”కు విరామం ఇచ్చారు కానీ.. ఇప్పుడు.. పాదయాత్ర ముగింపునకు వచ్చింది కాబట్టి.. కొత్తగా… కథనాలు ప్రారంభించారు. అందులో భాగంగా.. ఓ తొమ్మిదో తరగతి పాప గురించి … రాసింది చదివితే ” పిండేశారంతే..” అని మనసు దిటవు చేసుకోవాల్సిందే.

జగన్ ను చూడాలంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట.. కానీ ఆ పాప.. రెండు కిలోమీటర్లు పరుగులు పెట్టుకుంటూ వచ్చిందట. ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూంటే.. జగన్ ఓదార్పు ఇచ్చారట. అదీ సాక్షి మ్యాటర్. కానీ అసలు విషయం వేరే ఉంది. మామూలుగా అయితే ఇప్పుడు జగన్ దగ్గరకు వేరే వారిని పోనివ్వడం లేదు. ముందుగా… పోలీసులు తనిఖీలు చేసి. ఆ తర్వాతే ఎవరినైనా పంపిస్తున్నారు. పెద్దలు లేకుండా చిన్న పిల్లల్ని అసలు రానివ్వరు. ఆ పాప గ్రామంలోని వైసీపీ నాయకులు జన సమీకరణలో.. తీసుకొచ్చారు. పనిలో పనిగా లైన్‌లో నిలబెట్టారు. మధ్యాహ్నం తీసుకొస్తే.. సాయంత్రం వరకూ నిలబెట్టారు. స్కూల్‌కి కూడా డుమ్మా కొట్టాల్సి వచ్చింది. ఈ బాధలన్నీ… జగన్ వల్లేనని ఆయన్ని చూడగానే ఏడ్చేసినట్లు ఉంది ఆ పాప. దానికే.. జగన్ .. సెంటిమెంట్ కలర్ ఇచ్చేశారు. సాక్షిలో ఓ కథ రాసేసుకున్నారు.

జగన్ పాదయాత్ర కవరేజీలో ఏం రాయాలో తెలియక.. ఆయన పాత్రికేయ సిబ్బంది నానా తంటాలు పడుతున్న విషయం… ఆ పేజీ లు చూస్తున్న వారికి సులువుగానే అర్థమైపోతుంది. టిప్‌టాప్‌గా తయారై వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా.. స్క్రిప్ట్ ప్రకారం తాము అత్యంత కడు పేదరికంలో ఉన్నామని చెబితే ఫోటోలతో సహా వేసేసి.. తమ టాలెంట్‌ని చూపిచాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. మరో రెండు, మూడు శుక్రవారాలు దాటితే… పాదయాత్ర ముగిసిపోయే అవకాశం ఉంది. అందుకే.. ఇప్పుడు సెంటిమెంట్‌ను మరింత దట్టిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా.. ఈ సెంటిమెంట్ ప్రదర్శన చూసి.. పడి పడి నవ్వుకోవాల్సి వస్తోంది. … బాబూ.. చిట్టీ.. ! సెంటిమెంట్ కామెడీ అయిపోతోందమ్మా..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close