జీతాలు,, పెన్షన్లు పెండింగ్.. కానీ ఆసరా మీట నొక్కేస్తున్నారు !

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల పెన్షన్లు అత్యధిక మందికిరాలేదు. కొంత మంది జీతాలూ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆసరా పథకం కింద రూ. 6400 కోట్లు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు మీట నొక్కే కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త అప్పులు తీసుకునేందుకు అవకాశాలు లభించడంతో గత మూడు, నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఇబ్బంది లేకుండా పోయింది.

రెండు, మూడు రోజులు ఆలస్యమైనా వచ్చాయి. కానీ అప్పుల పరిమితి తీరిపోవడంతో కొత్త చిక్కులు ప్రారంభమయ్యాయి. అదనపు అప్పుల కోసం అనుమతి తెచ్చుకున్నా అమలు చేయాల్సిన పథకాల భారం మాత్రం పెరిగిపోతోంది. ఈ కారణంగా ప్రభుత్వానికి చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆసరా పథకం నిధులు కూడా ఒకే సారి జమ చేయడం లేదు. వేడుకలు నిర్వహించి పది రోజుల పాటు జమ చేస్తామని చెబుతున్నారు.

దీంతో జీతాలు, పెన్షన్లతో పాటు ఆసరా పథకం డబ్బులు కూడా బ్యాంకుల్లో ఎప్పుడు పడతాయో లబ్దిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ. రెండు వేల కోట్ల రుణం..అలాగే ఆస్తులు తాకట్టు పెట్టి మరికొన్ని వేల కోట్ల రుణాల కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇవి విజయవంతం అయితే చిక్కులు తప్పిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close