బ్రేకింగ్‌: పూరితో స‌ల్మాన్ సినిమా

మ‌న ‘పోకిరి’ని బాలీవుడ్‌లో `వాంటెడ్‌’ పేరుతో రీమేక్ చేసి సూప‌ర్ హిట్టు కొట్టాడు స‌ల్మాన్ ఖాన్‌. అప్ప‌టి నుంచీ పూరి నుంచి ఏ సినిమా వ‌చ్చినా, స‌ల్మాన్ ఖాన్ దృష్టి అటువైపు ప‌డిపోతుంటుంది. ఈ సినిమాతోనే పూరి బాలీవుడ్‌లోనూ పాపుల‌ర్ అయ్యాడు. అలా.. అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేశాడు. ఇప్పుడు మ‌రోసారి పూరి పేరు బాలీవుడ్‌లో వినిపిస్తోంది. పూరితో సినిమా చేయ‌డానికి స‌ల్మాన్ ఖాన్ సైతం ఆస‌క్తి చూపిస్తున్నాడు.

స‌ల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘ద‌బాంగ్ 3’ ఈ డిసెంబ‌రులో విడుద‌ల కానుంది. ఈలోగా ప్ర‌మోష‌న్ల‌నీ ముమ్మ‌రం చేశాడు స‌ల్మాన్ ఖాన్‌. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని పాత్రికేయుల‌తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడాడు స‌ల్మాన్‌. అందులో భాగంగా పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా తీయొచ్చు క‌దా? ఆ అవ‌కాశం ఉందా? అనే ప్ర‌శ్న స‌ల్మాన్‌కి ఎదురైంది. ”త్వ‌ర‌లోనే నేనూ, ప్ర‌భుదేవా హైద‌రాబాద్ వ‌స్తాం. అప్పుడు పూరిసార్‌ని క‌లుస్తాం. అన్నీ కుదిరితే సినిమా కూడా ఉంటుంది” అని స‌మాధానం చెప్పాడు స‌ల్మాన్‌. ద‌క్షిణాది క‌థ‌ల‌పై బాలీవుడ్ హీరోలు ఎక్కువ మ‌క్కువ చూపిస్తున్నారు. ఇక్క‌డి ద‌ర్శ‌కులు అక్క‌డ హిట్లు కొడుతున్నారు. ఈ నేప‌థ్యంలో పూరి – స‌ల్మాన్ కాంబో కుదిరిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close