వింబుల్డన్ ఫైనల్లో సానియా, హింగిస్ జోడీ

భారతీయ మహిళా టెన్నిస్ మరో మెట్టు పైకెదిగింది. సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ వింబుల్డన్ మహిళల డబుల్స్ ఫైనల్స్ కు చేరింది. సెమీ ఫైనల్లో మేరీ పియర్స్, కోప్స్ జోడీని వరస సెట్లలో చిత్తు చేసింది. 6-1, 6-2 స్కోరుతో అలవోకగా ఓడించింది. గతంలో అనేక టైటిల్స్ గెల్చుకున్న సానియా, వింబుల్డన్ ఫైనల్స్ కు చేరడం ఇదే మొదటిసారి.

ఈ మధ్య వరస విజయాలతో మంచి ఊపు మీదున్న సానియా జోడీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీస్ ఆడింది. మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం చాటింది. ప్రత్యర్థి జోడీకి కుదురుకోనివ్వకుండా తమదైన షాట్లతో దాడి చేసింది. తొలి సెట్ ను 6-1 తో గెలుచుకుందంటే సానియా జోడీ ఎంత ఫామ్ లో ఉందో అర్థమవుతుంది. రెండో సెట్లో ప్రత్యర్థి జోడీ కాస్త పోటీ ఇవ్వడానికి ప్రయత్నించినా సానియా, హింగిస్ ధాటికి తట్టుకోవడం సాధ్యం కాలేదు. దీంతో 6-2తో సానియా జోడీ సెట్ ను, మ్యాచ్ ను గెల్చుకుంది.

అనేక ఏటీపీ టోర్నీల్లో టైటిల్స్ గెల్చుకున్న సానియా, మహిళల డబుల్స్ లో ఇంత వరకూ గ్రాండ్ స్టామ్ టైటిల్ ను గెల్చుకోలేదు. 2011లో ఎలెనా వెస్నినాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు చేరింది. కానీ విజయం సాధించలేక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఓ గ్రాండ్ స్లాం టోర్నీ ఫైనల్ చేరడం ఇది రెండో సారి. ఫైనల్లో సానియా మెరుపులు విజయాన్ని సాధిస్తే అది సంచలనమే అవుతుంది. భారతీయ టెన్నిస్ కు క్రేజ్ ను తెచ్చిన సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరే అవకాశం ఉంది. మరి, ఫైనల్లో ఈ జోడీ ఇదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close