బాహుబ‌లి త‌ర‌వాత‌.. స‌ర్దారే

స‌ర్దార్ – గ‌బ్బ‌ర్‌సింగ్ రిజ‌ల్ట్ ప‌క్క‌న పెడితే.. తొలిరోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఫ‌స్ట్ డే ఇండ్ర‌స్ట్రీ రికార్డుకు ఎంత ద‌గ్గ‌ర‌గా ఉందో ఇప్పుడే చెప్ప‌లేం గానీ.. ఓవ‌ర్సీస్‌లో మాత్రం గ‌బ్బ‌ర్‌సింగ్ రికార్డు సృష్టించింద‌నే చెప్పాలి. అమెరికాలో ఈ సినిమా తొలి రోజు రూ.4.3 కోట్లు సాధించిందని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క గ‌ట్టాయి. బాహుబ‌లి త‌ర‌వాత తొలి రోజు అమెరికాలో ఇన్ని వ‌సూళ్లు సాధించిన చిత్రం స‌ర్దారే. శ్రీ‌మంతుడు (3.7) కోట్లు కూడా త‌రువాతి స్థానంలో ఉన్నాడు. ప్రీమియ‌ర్ షోలు ఎక్కువ‌గా ప‌డ‌డం, వాటి రేట్లు అధికంగా ఉండ‌డంతోనే స‌ర్దార్ ఈ మ్యాజిక్ చేయ‌గ‌లిగిందేమో. శ‌ని, ఆదివారాలు కూడా స‌ర్దార్ ఇదే దూకుడు చూపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్ర్రాల‌లో తొలిరోజు రికార్డులు ప‌రిశీలిస్తే… స‌ర్దార్ రెండో స్థానంలో ఉండొచ్చ‌ని, బాహుబ‌లి వ‌సూళ్ల‌కు అతి ద‌గ్గ‌ర‌లో వ‌చ్చి ఆగిపోయే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ప్రీమియ‌ర్ షో టికెట్లు ఎక్కువ రేట్లు పోసి అమ్మేయ‌డం వ‌ల్ల‌.. ఆ లెక్క‌లు స్ప‌ష్టంగా తెలుస్తాయా, లేదా అన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తాని స‌ర్దార్ తొలిరోజే శ్రీ‌మంతుడ్ని దాటేసింది. ఓవ‌రాల్ ప‌రిస్థితి మాత్రం ఇప్పుడే చెప్ప‌లేం. శ్రీ‌మంతుడు టోట‌ల్‌గా రూ.150 కోట్ల గ్రాస్ సాధించాడు. రిజ‌ల్ట్‌ని బ‌ట్టి చూస్తే స‌ర్దార్‌కి అంత సీన్ లేదు మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close