జయలలిత అక్రమాస్తుల కేసు మార్చి 10కి వాయిదా

కొంత మంది రాజకీయ నాయకులని కొన్ని కేసులు జీవితాంతం భూతంలాగ వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి తదితరుల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. వీరి కేసుల పుణ్యామాని ఇప్పుడు సామాన్య ప్రజలకు సైతం ఎఫ్.ఐ.ఆర్.లు, కోర్టులు, పిటిషన్స్, విచారణలు, వాయిదాలు, బెయిలు వంటి చట్టపరమయిన విషయాల గురించి మంచి అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చును.

విషయంలోకి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని అక్రమాస్తుల కేసులో ఆమెకు కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ళు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. కానీ కర్నాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించి, ఆ శిక్షలు రద్దు చేసి విడుదల చేసింది. కర్నాటక ప్రభుత్వం ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు పిటిషన్ వేయడంతో మళ్ళీ ఆమె న్యాయపోరాటం మొదలయింది.

కర్నాటక ప్రభుత్వం వేసిన ఆ పిటిషన్ని గురువారంనాడు విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు దానిని మళ్ళీ మార్చి 10కి వాయిదా వేసింది. కనుక మళ్ళీ అంతవరకు ఆమెకు తాత్కాలికంగా ఊరట లభించినట్లే. శుక్రవారంలోగా ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను, ఫైళ్ళను సమర్పించవలసిందిగా ఆమె తరపున వాదించిన న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒకపక్క జయలలితపై సుప్రీం కోర్టులో ఈకేసుపై విచారణ జరుగుతుంటే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమయిన డిఎంకె పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆమె సమక్షంలో అన్నాడిఎంకె పార్టీలో చేరిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close