ఎన్‌కౌంటర్ నిజాల వెలికితీతకు సుప్రీంకోర్టు కమిషన్ ..!

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా కమిషన్ ను ఏర్పాటు చేశారు. వీరు హైదరాబాద్ నుంచే విచారణ జరుపుతారు. తొలి విచారణ తేదీ విచారణ కమిషన్‌కి నేతృత్వం వహిస్తున్న వారి ఇష్టమేనని, ఆరు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కమిషన్‌ను ఆదేశించింది.

వీరికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ వివరాలను మీడియాకు లీక్ కాకుండా చూడాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతే కాదు.. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన జరుగుతున్న అన్ని రకాల దర్యాప్తులను ఆపాలని… ఈ కమిషన్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకించారు.

ఎన్‌కౌంటర్ .. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. ఇప్పటికే సిట్‌ దర్యాప్తు జరుగుతోందని, దానికి సమాంతరంగా విశ్రాంత న్యాయమూర్తి విచారణ ఎందుకని రోహత్గి అని ప్రశ్నించారు. రోహత్గి అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందని సీజేఐ అన్నారు. మొత్తానికి దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై విచారణ ఆరు నెలల పాటు సాగే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close