ఉత్తరాఖండ్ లో మళ్ళీ రాష్ట్రపతి పాలన

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. నిన్న ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీష్ రావత్ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వీలు కల్పిస్తే, ఈరోజు సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విదించింది. ఈ కేసును ఏప్రిల్ 27కి వాయిదా వేస్తూ అంతవరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయబోమని కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ నుంచి వ్రాతపూర్వకంగా ఒక హామీని తీసుకొంది. అంతవరకు రాష్ట్రం గవర్నర్ పాలనా క్రింద నడుస్తుంది. కనుక హరీష్ రావత్ చేతికి ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లే వచ్చి కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ చేజారి పోయింది.

ఈ కేసులో ఇరు పక్షాలు తమ వాదన వినిపించేందుకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా మరియు జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై ఉత్తరాఖండ్ హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు కాపీలను ఏప్రిల్ 26లోగా ఇరు పక్షాలకు అందజేయాలని, ఆ మరునాడు అంటే ఏప్రిల్ 27న వాటి ఆధారంగా వాదనలు విన్న తరువాత దీనిపై తీర్పు వెలువరిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పీకర్ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్ వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించడమంటే మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమేనని వాదించడంతో, ఆవిధంగా జరగదని సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వద్ద లిఖిత పూర్వకంగా హామీ తీసుకొంది. ఈ కేసును అవసరమయితే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. కనుక ఏప్రిల్ 27 వరకు అందరూ వేచి చూడవలసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close