తెలంగాణ సర్కారు మెడకు “సీక్రెట్ కరోనా మరణం”..!

కరోనా వైరస్‌ను డీల్ చేస్తున్న వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టెస్టులు తక్కువ చేయడంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు కొత్తగా కరోనా మరణం పేరుతో.. ఓ వ్యక్తిని కుటుంబానికి దూరం చేసిన వివాదం దుమారం రేపుతోంది. వనస్థలిపురానికి చెందిన మధుసూదన్‌ అనే వ్యక్తికి కరోనా సోకిందని ఏప్రిల్ నెలాఖరును గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులకూ ఏమయ్యారో చెప్పలేదు. చివరికి కుటుంబ సభ్యులు.. మధుసూదన్ గురించి అడిగితే.. గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మే 1న చనిపోయాడని సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్లు హతాశులయ్యారు.

మధుసూదన్ భార్య తన భర్త ఆచూకీ తెలియడం లేదని మే 21న ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు చనిపోయారని చెబుతున్నారని.. చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని మాధవి ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా మధుసూదన్ అంత్యక్రియలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంపై మంత్రి ఈటల కూడా స్పందించి వివరణ ఇచ్చారు. వారి కుటుంబం షాక్‌కు గురి కాకూడదనే చెప్పలేదన్నారు. అంత్యక్రియలు జీహెచ్ఎంసీ సిబ్బందే చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని మధుసూదన్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణలో అసలు మధుసూదన్ బ్రతికి ఉన్నాడా? లేడా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మధుసూదన్ కరోనాతో చనిపోయాడాని అడ్వకేటే జనరల్‌ కోర్టుకు తెలిపారు. మరి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. అంత్యక్రియలు నిర్వహిస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని ఆదేశించింది. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో శుక్రవారంలోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close