సీమ మేధావులూ ..హైకోర్టు పోరాటం ఓకే కానీ పరిశ్రమల్ని వెళ్లగొడుతూంటే మాట్లాడరా !?

కర్నూలులో న్యాయరాజధాని ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీనే కర్నూలులో న్యాయరాజధాని కోసం గర్జన నిర్వహిస్తోంది. దీనికి మేధావులుగా చెలామణి అవుతున్న వారు మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు వల్ల ఏం వస్తుంది.. ఎంత మందికి ఉపాధి లభిస్తుంది.. అన్న విషయాలను వారు చర్చించడం లేదు. మనకు రావాల్సిన హైకోర్టును ఆపేస్తున్నారని ఓ భావోద్వేగం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. సీమ యువత ఆకలి తీర్చే ఉద్యోగాలను ఇచ్చే పారిశ్రామిక సంస్థలను వెళ్లగొడుతున్నారు. దీని గురించి ఒక్క మాట కూడా వారు మాట్లాడటం లేదు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోయింది.కియా లాంటి భారీ పరిశ్రమ వచ్చినప్పుడు అనుబంధ పరిశ్రమలు కుప్పలు, తెప్పలుగా ఏర్పడాలి. కానీ ప్రభుత్వ భయంతో ఒక్కరూ రాలేదు. అందరూ ఇతర రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. చివరికి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించిన జాకీ కూడా తెలంగాణకు వెళ్లిపోయింది. ఇప్పుడు.. చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి కల్పించడానికి అమెరికా నుంచి వచ్చిన పరిశ్రమలు పెట్టిన.. అమరరాజా గ్రూప్ కూడా .. చిత్తూరు కాదని తెలంగాణను ఎంచుకుంది. ఇక విస్తరణ ఇతర రాష్ట్రాల్లోనే ఉంటుందని ఆ సంస్థ తేల్చి చెప్పింది.

రాయలసీమలో రావాల్సిన అతి పెద్ద జియో ప్లాంట్ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇలా లెక్కలు వేసుకుంటే.. సీమ యువతకు రావాల్సిన కొన్ని లక్షల ఉద్యోగాలు .. ప్రభుత్వ వైఖరి.. వైసీపీ నేతల దౌర్జన్యాల వల్ల దూరమయ్యాయి. దీనిపై ఒక్కరంటే ఒక్క మేధావి మాట్లాడటం లేదు. యువతలో పెరిగోపుతున్న అసహనాన్ని హైకోర్టు పేరుతో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీమ యువతకు తీరని ద్రోహం చేస్తున్నారు. రాజకీయాల కోసం.. ఓ పార్టీ అధికారంలో ఉండటం కోసం.. తమ ప్రాంత యువతను నిర్వీర్యం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని మేధావుల బృందం బయలుదేరింది. ఇప్పుడు అదే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close