టీడీపీ సభ్యుడు శేఖర్ రెడ్డి సంపదను చూసిన ఐటీ అధికారులకు అడుగడుగునా షాకింగ్ దృశ్యాలే కనిపిస్తున్నాయి. చెన్నైలోని శేఖర్ రెడ్డి, అతడి అనుచరుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారుల సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 107 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శేఖర్ రెడ్డి ఇళ్లలోనే కాదు, కారులోనూ క్యాష్ దాచాడు. అతడి అనుచరుడు తీసుకెళ్తున్న కారును వెంబడించి పట్టుకున్న అధికారులు అందులో తొంగిచూసి అవాక్కయ్యారు. ఆ కారులో 24 కోట్ల రూపాయల కరెన్సీ దొరికింది. అన్నీ 2 వేల రూపాయల నోట్లే. విడుదలైన నెలరోజుల్లో ఇంత భారీగా కొత్త కరెన్సీ అతడికి ఏ బ్యాంకు వారు ఇచ్చారో తెలియడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక, గ్రానైట్ వ్యాపారంలో ఈ స్థాయిలో లాభాలుంటాయా లేక మరేతైనా మతలబు ఉందా అనేది తెలియాల్సి ఉంది.
శేఖర్ రెడ్డి బాగోదం బయటపడటంతో ఏపీ ప్రభుత్వం అప్రత్తమైంది. టీడీపీ బోర్దు సభ్యుడి పదవి నుంచి అతడిని తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతడి బోర్డు సభ్యత్వం రద్దయింది. ఇవాళో రేపో శేఖర్ రెడ్డిని, అతడి ముఖ్య అనుచరులైన శ్రీనివాస రెడ్డి, ప్రేం లను అరెస్టు చేయవచ్చని సమాచారం.