మూఢ నమ్మకాలు ఉండకూడదు, విచక్షణతో ఆలోచించాలి లాంటి బోలెడన్ని కబుర్లను మన మీడియా వాళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. కానీ రోజూ రాసే వార్తల్లో మాత్రం అవే ఎక్కువ ఉంటాయి. వామపక్షాలు ఇచ్చిన బంద్ ఎఫెక్ట్తో జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఓపెనింగ్ డే కలెక్షన్స్ మిస్ చేసుకోకూడదని, లాంగ్ వీకెండ్ని క్యాష్ చేసుకుందామని మాత్రమే జనతా టీం ఆలోచించింది. సినిమా బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే వాళ్ళ ఆలోచన వంద శాతం కరెక్టే.
కానీ మీడియాకు మాత్రం సెంటిమెంట్స్ గుర్తొచ్చాయి. ఒకటో తేదీ అమావాస్య అన్న విషయం తెలిసొచ్చింది. అమావాస్య రోజు సినిమాను ఎలా రిలీజ్ చేస్తారు? ఆ రోజు సూర్య గ్రహణం కదా. సినిమా రిలీజ్ చేయడం తప్పు కదా? అన్నది మీడియా ఫీలింగ్. వాళ్ళు రాసే వార్తలు అదే చెప్తున్నాయి మరి. ఈ లాజిక్ మరీ సిల్లీగా ఉంది కదా. రాసినవాళ్ళకు కూడా ఆ విషయం అర్తమైనట్టుంది. అందుకే అభిమానులు ఆ సెంటిమెంట్ని సీరియస్గా తీసుకున్నారని, ఏం జరుగుతుందో అని భయపడుతున్నారని రాసుకొచ్చారు. ఆ అభిమాని ఎవరని అడక్కండి. సినిమా వాళ్ళందరూ సెంటిమెంట్స్ కోసం చచ్చిపోతారని, ముహూర్తం చూసుకోనిదే ఏ పనీ స్టార్ట్ చేయరని కూడా చెప్పుకొచ్చింది మీడియా.
కొరటాల శివ, ఎన్టీఆర్లు కూడా సినిమా వాళ్ళేగా. వాళ్ళకు లేని సెంటిమెంట్స్ మీడియాకు ఎందుకు? ఇలాంటి వార్తలతో జనాలకు ఏం మెస్సేజ్ ఇస్తున్నారు?