సుప్రీం కోర్టులో సుజనా చౌదరికి ఎదురుదెబ్బ

కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మారిషస్ బ్యాంకుకి ఆ సంస్థ చెల్లించాల్సిన రూ. 100 కోట్లను ఐదు నెలల్లోగా చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయగా సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పును సమర్ధించింది. సుజనా ఇండస్ట్రీస్ మారిషస్ బ్యాంకుకి నిర్దేశిత గడువులోగా రూ. 100 కోట్లను చెల్లించాలని సుప్రీం కోర్టు ఈరోజు తన తీర్పులో పేర్కొంది.

ఈ కేసులో ఆయన ఇప్పటికే చాలా అప్రదిష్టపాలయ్యారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవడంతో ఆయనకి ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా తెదేపా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ జూన్ నెలలో ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా పూర్తికావస్తోంది. ఒకవేళ ఈ కారణంగా ఆయనకు మళ్ళీ రాజ్యసభకి పంపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాకరించినట్లయితే, ఆయన తన కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేయవలసి ఉంటుంది. ఆయనని మళ్ళీ రాజ్యసభకు పంపినా ప్రతిపక్షాల నుండి అందుకు విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనను వెనకేసుకొని వచ్చినా అవినీతి మరక అంటుకొన్న కారణంగా ప్రధాని నరేంద్ర మోడి ఆయనను తన మంత్రివర్గంలో కొనసాగనిస్తారో లేదో చెప్పలేము. కనుక ఈ తీర్పు వలన ఆయన కంపెనీకే కాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకి, తెదేపాకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close