ఆరు బుల్లెట్లు దిగినా వెనక్కి తగ్గని వీరుడు అతను!

పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం ఎనిమిది మంది సైనికులు మరణించగా ఇంకా మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో శైలేష్ గౌర్ అనే సైనికుడు కూడా ఒకడు. అతను పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ విభాగం వద్ద ఆ రోజు విధులు నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులు లోపలకి చొరబడి కాల్పులు మొదలుపెట్టగానే అప్రమత్తమయిన శైలేష్ గౌర్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాడు. అతనితో పాటు అక్కడే విధులు నిర్వహిస్తున్న గురుసేవక్ సింగ్ కూడా ఉగ్రవాదులతో పోరాటం మొదలుపెట్టాడు.

ఉగ్రవాదులను నిలువరించడంలో వారిరువురూ సఫలమయ్యారు. కానీ వారిలో గురుసేవక్ సింగ్ శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోవడంతో చనిపోయాడు. శైలేష్ గౌర్ శరీరంలోకి కూడా ఆరు తూటాలు దూసుకుపోయాయి. దానితో అతను కూడా నేలకూలిపోయాడు. కానీ ప్రాణాలు కోల్పోలేదు. అంత బాధలోను తీవ్ర రక్తస్రావం అవుతున్నపటికీ శైలేష్ గౌర్ ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా తన వద్ద ఉన్న తుపాకీతో ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించకుండా నిలువరించగలిగాడు. ఈలోగా అక్కడికి అదనపు భద్రతాదళాలు చేరుకొని ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

ప్రాణాలు లెక్క చేయకుండా ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసిన శైలేష్ గౌర్ ని తక్షణం మిలటరీ ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు చేసి శరీరంలో దూసుకుపోయిన తూటాలనన్నిటినీ బయటకి తీశారు. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో కోలుకొంటున్నట్లు సమాచారం. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను నిలువరించిన శైలేష్ గౌర్ దైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. యావత్ భారతదేశ ప్రజలు ఆయన సాహసానికి, దేశభక్తికి సాల్యూట్ చేయవలసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close