ఆ సినిమాలో ప‌వ‌న్ కళ్యాణ్ పెట్టుబ‌డి ఎంత‌?

ప‌వ‌న్ ఇప్పుడు పూర్తిగా రాజ‌కీయ వాసి అయిపోయాడు. సినిమాల్ని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టే. అయితే… ఆయ‌న మ‌రీ సినిమాల‌కు దూరం అయిన‌ట్టు అనుకోకూడ‌దు. నిర్మాత‌గా త‌న నుంచి ఓ సినిమా వ‌స్తోంది. నితిన్ క‌థానాయ‌కుడిగా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే… ఈ సినిమాకి డబ్బులు పెట్టిందంతా శ్రేష్ట్ మీడియా అని, నితిన్ కేవ‌లం ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌ల పేర్లు వాడుకుంటున్నాడ‌ని, పేర్లు వాడినందుకే లాభాల్లో వాటా ఇవ్వ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే అత్యంత స‌న్నిహితులు అందించిన స‌మాచారం ఏమిటంటే… ఈ సినిమా ప్రారంభించిన రోజే ప‌వ‌న్ రూ.2 కోట్లు ఏక మొత్తంగా ఇచ్చాడ‌ట‌. బ‌హుశా.. ప‌వ‌న్ పెట్టుబ‌డి అదే కావొచ్చు. నితిన్ – కృష్ణ చైత‌న్య సినిమాకి రూ.15 కోట్ల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టే ఛాన్స్ ఉంది. అందులో ప‌వ‌న్ వాటా.. ప్ర‌స్తుతానికి రూ.2 కోట్లు అనుకోవాలి. మ‌రి త్రివిక్ర‌మ్ ఎంత ఇచ్చాడ‌న్న‌ది లెక్క తేలాలి. కేవ‌లం ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ల పేర్లే కాదు, వాళ్ల డ‌బ్బులూ ఈ సినిమాలో ఉన్నాయి. ఆ విష‌యాన్ని గ‌మ‌నిస్తే మంచిద‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close