అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి

ఏపి రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. సింగపూర్ నిర్మాణ సంస్థలు అంచనా ప్రకారం కనీసం రూ.1-1.25లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. కనుక స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. అయితే రాజధాని నిర్మాణానికి అవసరమయిన పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి విధించిన కొన్ని షరతుల కారణంగా ఇంతవరకు పనులు మొదలుకాలేదు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన రెండు షరతులను సింగపూర్ సంస్థలు ఉపసంహరించుకోవడంతో మళ్ళీ ఈ వ్యవహారంలో కదలిక వచ్చినట్లయింది.

వాటిలో మొదటి షరతు: రాజధాని భూ కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు, పాత్ర ఉండకూడదు. రెండవ షరతు: ఒక సంస్థకు భూమిని కేటాయిస్తే దానికి 25కిమీ పరిధిలో ఎక్కడా అటువంటి మరొక సంస్థకు భూమిని కేటాయించకూడదు.

మొదటి షరతు విషయంలో సింగపూర్ సంస్థలు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా భూకేటాయింపుల విషయంలో సమాన హక్కులుకలిగి ఉండేందుకు అంగీకరించాయి. భూమి ధర నిర్ణయం, కేటాయింపులు వగైరా వ్యవహారాల కోసం సింగపూర్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ వంటిదానిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అంగీకరించింది. అలాగే రెండవ షరతుని పూర్తిగా ఉపసంహరించుకొంది. మరికొన్ని ఇబ్బందికర షరతులపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సింగపూర్ సంస్థలకు వాటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు సూచించింది. వాటిపై కూడా ఇరు పక్షాలకి అంగీకారం కుదిరినట్లయితే, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తాయి. ఆ తరువాతే రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టవచ్చును. బహుశః ఈ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి మరొక రెండు మూడు నెలలు పడుతుందేమో? అంటే జూన్ లేదా జూలై నెలలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఆశించవచ్చును. ఈ లోగా కేంద్రం నుండి అవసరమయిన అనుమతులు సాధించుకోవడానికి సమయం సరిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close